జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ తిరిగి తిరిగి అంతా అతను చంద్రబాబు అండర్ లోనే ఇంకా పని చేస్తున్నాడని మరియు రాజకీయాలపై పెద్దగా అవగాహన మరియు సీరియస్ నెస్ లేవు అని అనాల్సిందే తప్ప మిగతా వారి లాగా ఒకరికి అన్యాయం చేయడం మరియు అవినీతికి పాల్పడటం వంటి ఆరోపణలు అయితే ఇప్పటివరకు రాలేదు. ఇకపోతే పవన్ మాత్రం తనకు ఉన్న మంచి ఇమేజ్ ను క్యాష్ చేసుకుని రాజకీయంగా పెద్దగా ఎదగలేకపోయారు. అయితే ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో జనసేనాని ముందు ఒక సువర్ణ అవకాశం నెలకొంది.
వివరాల్లోకి వెళితే వైరస్ వ్యాప్తి ఆంధ్రప్రదేశ్లో మొదలైనప్పటి నుండి పవన్ ప్రజలను ఉద్దేశించి ఈ మహమ్మారి విషయంలో ప్రసంగించింది అయితే లేదు. సరే గతాన్ని వదిలిపెడితే ప్రస్తుతం కరోనా చికిత్సలో మన రక్తంలో ఉండే ‘ప్లాస్మా’ ప్రాధాన్యత పెరిగింది. కరోనా నుంది కోలుకున్న వ్యక్తుల నుంచి రక్తాన్ని సేకరించి దానిని అదే బ్లడ్ గ్రూప్ లో ఉన్న మరొక కరోనా బాధిత పేషెంట్ కు ఇస్తే అతను కోలుకునే చాన్సులు భారీగా పెరుగుతాయి. దీనిని ‘ప్లాస్మా థెరపీ’ అంటారు.
అయితే కరోనా నుండి కోలుకున్న వ్యక్తులు ఎవరూ ఇతరులకు సహాయ పడేందుకు…. తమ రక్తం ఇచ్చేందుకు మొగ్గు చూపకపోవడం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను నిరుత్సాహానికి కూడా గురి చేస్తోంది ఇంకా కలవరపెడుతోంది కూడా. ఇప్పటికే ఈ సమస్యను అధిగమించడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్మా ఇచ్చే వారికి మనిషికి ఐదు వేల రూపాయల బహుమతిని ప్రకటించింది. మన రాష్ట్రంలో ఇంత దీనస్థితి రాకముందే అత్యంత చరిష్మా కలిగిన పవన్ కళ్యాణ్ ను లక్షల మంది అభిమానులు ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి అతను ఒక వీడియో లో అలా దీని గురించి ప్రస్తావిస్తే చాలు ఎంతో మంది అతని మాట విని దీని యొక్క మహనీయ తెలుసుకుని ముందుకు కదులుతారు అన్నది ఖచ్చితమైన పరిణామం.
ఇక జగన్ చేయవలసిన పనిని పవన్ చేసి దగ్గరుండి ప్రజల ప్రాణాలను కాపాడాడు అని జనసైనికులు తమదైన శైలిలో సోషల్ మీడియాలో చెలరేగుతారు అనుకోండి అది వేరే విషయం. అయితే ఇక్కడ రాజకీయ లబ్ధిని పక్కన పెడితే ఈ సమయంలో ముఖ్యమంత్రి కన్నా బాగా ముందుచూపుతో ఆలోచించారు అని…. ప్రజల్లో చైతన్యం ఆలోచన తీసుకురాగలరన్న ముద్ర పడిపోతుంది. మరి పవన్ ఈ దిశగా అడుగులేస్తారా లేదా?