ఈ ఏడాది ప్రారంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తో సంక్రాంతి పండుగకు వచ్చే హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత లాక్ డౌన్ సమయం లో గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం తో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నట్లు కృష్ణా పుట్టినరోజు నాడు అధికారిక ప్రకటన చేసిన మహేష్ త్వరలో సినిమాకి సంబంధించి షూటింగులో పాల్గొన బోతున్నారు.
సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేయగా అక్కడ పరిస్థితి కరోనా వల్ల డేంజర్ గా ఉండటంతో.. హైదరాబాదులోనే సినిమాకి సంబంధించి సరికొత్త సెట్లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు టాక్. సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ మాత్రమే కాక మహేష్ మేక్ఓవర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
అతిధి సినిమా తరహాలో లాంగ్ హెయిర్ తో పాటు కొత్తగా చెవికి పోగు అదేవిధంగా మెడపై రూపాయి బిళ్ళ టాటూ వేయించుకోవడం తో.. సినిమాలో మహేష్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ కనిపించనున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. కానీ వస్తున్న వార్తల్లో నిజం ఎంతో సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గతంలో మహేష్ బాబు.. పవన్ నటించిన జల్సా సినిమా కి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి తరుణంలో మహేష్ సినిమాలో పవన్ ఉండబోతున్నట్లు వార్త రావడంతో ఫిలిం సర్కిల్ లో ఈ వార్త సంచలనం అయింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!