Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ Pawan Kalyan 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైజాగ్ Vizag కేంద్రంగా ఇసుక విషయంలో ప్రభుత్వం పై నిర్వహించిన ర్యాలీ దేశంలోనే హైలెట్ అయిన సంగతి తెలిసిందే. వైజాగ్ పొలిటికల్ గా పోటీ చేసి ఓడిపోయిన కానీ చాలా వరకు.. పవన్ కళ్యాణ్ కి కలిసి వచ్చిన ప్లేస్ అని చాలామంది అంటారు. రాష్ట్రంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ కి ఉండదు కూడా ఇక్కడే అని చాలామంది చెబుతుంటారు. అటువంటి వైజాగ్ వేదికగా పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కీలక సరి కొత్త ఎత్తుగడలు వేయనున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడంపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పందించడం జరిగింది. ఖచ్చితంగా ప్రధానితో మాట్లాడి ఈ విషయంలో కార్మికులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే అంతర్గతంగా వినబడుతున్న టాపిక్ ఏమిటంటే ఒకవేళ బీజేపీ నేతలు వెనక్కి తగ్గకపోతే పవన్ కళ్యాణ్ ..
బీజేపీతో కటీఫ్ చెప్పే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా నేరుగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జేఏసీ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న తరహాలో .. సరికొత్త ఉద్యమానికి పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు అంతర్గతంగా వినబడుతున్న టాక్. ఒక్క ఇసుక విషయంలోనే పవన్ కళ్యాణ్ ఒక్క రెండు గంటలు చేసిన మార్చ్ కి.. వైజాగ్ మొత్తం స్తంభించి పోవడం జరిగింది. ఇలాంటి తరుణంలో నేరుగా ఒక ఉద్యమానికి శ్రీకారం చుడుతూ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగటం అంటే అది మామూలు విషయం కాదని పొలిటికల్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ కొత్త ఎత్తుగడలతో.. వైసీపీ ని గట్టిగా టార్గెట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.