దాదాపు రెండు సంవత్సరాల పాటు రాజకీయ రంగంలో బిజీ బిజీగా ఉండటంతో సినిమారంగానికి దూరమవడంతో మెగా అభిమానులు పవన్ ని చాలా మిస్ అయ్యారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీకి దిగిన పవన్ కళ్యాణ్ నిలబడిన రెండు చోట్ల ఓడిపోవడం మరింతగా అభిమానులను కృంగి పోయేటట్లు చేసింది.
అదే సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాలు చేయను ఓడిపోయినా గాని ప్రజల కోసమే నిలబడతాను, కట్టె కాలే వరకు రాజకీయాల్లోనే కొనసాగుతాను వంటి పెద్ద పెద్ద డైలాగులు వేయటం తో పవన్ అభిమానులు.. ఇంకా పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమైపోయారు అని తెగ బాధపడిపోయారు. కానీ ఏమైందో ఏమో గత ఏడాది ప్రారంభంలో నిర్ణయం మార్చుకుని “వకీల్ సాబ్” సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వటం మాత్రమే కాక అనేక సినిమాలను లైన్ లో పెట్టారు.
ఇదిలా ఉండగా ఇటీవల “వకీల్ సాబ్” సినిమా షూటింగ్ పూర్తికావటంతో.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో మొఘలుల కాలం నాటి చారిత్రాత్మక సినిమా చేసే ఆలోచన లో పవన్ వున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా తో పాటు మల్టీస్టారర్ సినిమా దగ్గుబాటి రానా తో చేయబోయే `అయ్యప్పనుమ్ కోషియమ్` ప్రాజెక్ట్ ను కూడా చేయాలని.. రెండూ ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లి కంప్లీట్ చేసే విధంగా డబల్ డ్యూటీ చేయడానికి పవన్ డైరెక్టర్లతో మంతనాలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. కరోనా దెబ్బ కి బాగా గ్యాప్ రావడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?