Pawan Kalyan: తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన దర్శకులకు డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తుంది. తను చేస్తున్న సినిమాలకు రెండు నెలలు మాత్రమే కాల్షీట్లు ఇస్తారని సమాచారం. ఇదిలా ఉండగా 2024 లో ఎన్నికలు జరగనున్నాయి, దాని కన్నా ముందుగా 2023లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యారు అంటే మళ్లీ సినిమాలకు సమయం కేటాయించలేకపోవచ్చు. అందుకే తన సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ జనవరిలో లో రిలీజ్ కావాల్సిన ‘భీమ్లానాయక్’ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. ‘హరిహర వీరమల్లు’ సినిమా సగం పూర్తయింది, ఈ సినిమాకి సంబంధించి మరో 40 రోజులు కాల్షీట్స్ ఇవ్వాల్సి ఉంది. మరో షెడ్యూల్ లో మొత్తం పూర్తి చేయాలి అనుకుంటున్నారు. డైరెక్టర్ క్రిష్ మరి ఇంత త్వరగా పూర్తి చేస్తారో లేదో చూడాలి.
దీని తర్వాత లైన్లో హరీష్ శంకర్ సినిమా ఉంది. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ 60 రోజులు కాల్షీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని సమాచారం. ఇప్పటికీ హరీష్కు రెండు నెలల్లో సినిమా పూర్తి చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ వేగంగా సినిమాలను పూర్తి చేసే అనుభవం ఉందని మనకి తెలిసిన విషయమే .మరి పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమాని కూడా ఇంత వేగంగా పూర్తి చేస్తారేమో చూడాలి.
ఇది ఇలా ఉండగా సురేందర్రెడ్డి తో పవన్ కళ్యాణ్ మరొక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.ఈ సినిమా కూడా రెండు నెలల్లో పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పుడు సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ సినిమాను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు,అది పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ లోగా పవన్ కళ్యాణ్ క్రిష్ ఇంకా హరీష్ శంకర్ ల సినిమాలు పూర్తి చేసేస్తారు. దాని తరువాత సురేందర్ రెడ్డి సెట్స్ పైకి వెళ్తారు. మొత్తానికి ఈ సంవత్సరం లో మూడు సినిమాలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. కానీ తన డైరెక్టర్లకు ఇది కష్టమైన టార్గెట్లు అంటున్నారు నెటిజన్లు. మరి అనుకున్నట్లుగానే టార్గెట్లు పూర్తి అవుతాయో లేదో వేచి చూడాల్సిందే.