Chandrababu Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానిసి పవన్ కళ్యాణ్ వెళ్లారు. వీరు ఇద్దరు దాదాపు గంట పాటు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఎంపీ, మిగిలిన ఎమ్మెల్యేల అభ్యర్ధుల ఎంపికపై ఇరువురూ మాట్లాడుకున్నట్లు సమాచారం.
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై, ఉమ్మడి ప్రచార సభలపై చర్చించుకున్నారు. ఇప్పటికే ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడి ఎన్నికలకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటనపైనా చర్చించినట్లు తెలుస్తొంది.
ఇప్పటికే టీడీపీ 128 అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించింది. మరో 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను టీడీపీ ప్రకటించాల్సి ఉంది. పెండింగ్ లో ఉన్న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్ధులను నేడో రేపో టీడీపీ ప్రకటించే అవకాశం ఉంది. మరో పక్క బీజేపీ అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీ కొన్ని స్థానాల విషయంలో పట్టుబడుతుంది. సీనియర్ నేతలు తమకు ఓడిపోయే సీట్లు ఇచ్చారని బీజేపీ నాయకత్వానికి లేఖలు రాయగా, దానిపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు అంశంపై కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తొంది. జనసేన పోటీ చేయనున్న 21 అసెంబ్లీ స్థానాలకు ఏడు స్థానాలకే అధికారికంగా అభ్యర్ధులను ప్రకటించింది. మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పవన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
AP High Court: ఏపీపీఎస్సీ గ్రూప్ -1 పరీక్ష రద్దుపై హైకోర్టు కీలక ఆదేశాలు