2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీతో చేతులు కలిపి రాజకీయం స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ సినిమాలు ఒప్పుకుంటూ రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో “వకీల్ సాబ్” సినిమాతో థియేటర్లలో లో రీ ఎంట్రీ స్టార్ట్ సంక్రాంతికి చేయబోతున్న పవన్ కళ్యాణ్… ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే డైరెక్టర్ క్రిష్, హరీష్ శంకర్ సినిమాలను లైన్ లో పెట్టడం జరిగింది.
ఇదే తరుణంలో మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన “అయ్యప్పనుం కోషియం” సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేయడానికి పవన్ కళ్యాణ్ రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. కాగా మరొక ముఖ్య పాత్రలో నటించే నటుడికి సంబంధించి ఎవరు అన్నదానిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన బయటికి రాలేదు.
ఈ పాత్రకు సంబంధించి దగ్గుబాటి రానా, రవితేజ, గోపీచంద్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి వారి పేర్లు మొన్నటి వరకు వచ్చాయి. కానీ తాజాగా మాత్రం పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించడానికి అక్కినేని హీరో సుమంత్ నీ సినిమా యూనిట్ సెలెక్ట్ చేసినట్లు టాక్. ఈ నేపథ్యంలో ఆ పాత్ర కోసం ఫుల్ గడ్డం తో సుమంత్ రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం.