రాజకీయంగా “పరిపక్వత లేని తన అమాయకత్వాన్ని” క్యాష్ చేసుకున్నాడనే కోపమో లేక అర్ధాంతరంగా వదిలేశారనే బాదో అదీగాక.. నాడు “ఓడమల్లన్న గారు” అన్న బాబు & కో, అనంతరం తనను “బోడి మల్లన్న”గా చిత్రీకరించినందుకు కలిగిన ఆవేదనో, ఆవేశమో.. కారణం తెలియదు కానీ… చాలా వ్యూహాత్మకంగా బాబుని ఇరికించేశాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్!
చంద్రబాబు కానీ, తమ్ముళ్లు కానీ ఎవ్వరూ ఊహించని రీతిలో… నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ గా నియమించే విషయంలో, గవర్నర్ సానుకూలంగా స్పందించారన్న ఆనందంలో ఉన్న బాబు & కో ల గుండెలపై “అమరావతిలోని ఒక పెద్ద రాయిని తీసి” వేశారు జనసేన అధినేత! దీంతో… నేడు అమరావతి రైతులు చేస్తున్న దీక్షలకు బాబే పరోక్ష కారణమని చెప్పకనే చెప్పారు!
ఇంతకూ పవన్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం… ఒక రోజు మోడీతో తామంతా ఉన్నప్పుడు చక్కటి రాజధాని కావాలి అన్న ప్రస్తావన వచ్చింది.. మోడీ మాట్లాడుతున్నప్పుడు గాంధీనగర్ ను ఉదహరించారు.. రెండు మూడు వేల ఎకరాల్లో చక్కటి బలమైన రాజధాని చేసుకోవచ్చు… కాలక్రమంలో అభివృద్ధి అవుతుంది అన్నారు.. చంద్రబాబుతో కలిపి అంతా దానికి ఆమోదం తెలిపారు.. కానీ… టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీ స్థాయిలో భూమి సేకరించారు. అంత భూమిని సేకరించడం పూర్తిగా తప్పు.. నేడు రైతులు పడుతున్న ఇబ్బందులకు అదే కారణం… అన్నస్థాయిలో పవన్ స్పందించారు!
ఇంతకు మించి ఏమి కావాలి… నేడు అమరావతిలోని రైతులు పడుతున్న ఇబ్బందులకు.. బాబు చెబుతున్న కలల రాజధాని “టెంపరరీ” రాజధానిగా మిగిలిపోవడానికి.. అన్నింటికీ చంద్రబాబే కారణం అని చెప్పడానికి! దీంతో… నేడు అమరావతి రైతులు పడుతున్న ఇబ్బందులకు తానే కారణమయ్యి… నేడు ఏమీ తెలియనట్లుగా.. రైతుల తరుపున దీక్షలు చేస్తున్నట్లు.. ధర్నాలు చేస్తున్నట్లు చేస్తూ.. మొసలి కన్నీరు కారుస్తున్నారు చంద్రబాబు.. అన్న క్లారిటీ పవన్ ఇచ్చినట్లయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు!