Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల సీరియస్ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రజలు.. స్థానికంగా ఉండే రోడ్లు మరియు గుంతల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని కోరారు. ఈ నేపథ్యంలో పవన్ తాజాగా సోషల్ మీడియాలో.. తన ప్రకటన కు వచ్చిన ఫోటోలను వాటి వివరాలను తెలియజేస్తూ మరోసారి వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. అడుగుకో గుంత గజానికో గోయి.. అనే నినాదంతో.. ఇచ్చిన పిలుపుకు దాదాపు 6.2 లక్షల ట్వీట్లు వచ్చాయని పవన్ స్పష్టం చేశారు.
దాదాపు ఈ విషయంలో మూడు రోజుల పాటు జనసేన పార్టీ కార్యకర్తలు మరియు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని.. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు చూపిస్తూ వీడియో రూపంలో.. ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్లు మృతి దారులుగా మారిపోయాయని పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిని వెల్లడించే చాయాచిత్రాలను ప్రదర్శించారు.
దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. మరోపక్క రాష్ట్రంలో వర్షాలు భారీగా కురుస్తున్న టైంలో ఎవరు కూడా రోడ్లు మరమ్మతులు కార్యక్రమం చేయారని.. వర్షాకాలం సీజన్ అయిన వెంటనే రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు కార్యక్రమం చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉందని ఈ విషయాన్ని విపక్షాలు అర్థం చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు. గత కొన్ని రోజుల నుండి రాష్ట్రంలో వర్షాలు భారీగా పడుతుండటంతో.. రోడ్ల మరమ్మతులు కార్యక్రమం చేపట్టలేక పోతున్నామని.. వర్షం లో ఎవరు కూడా రోడ్లు వేసే పరిస్థితి ఉండదని అంటున్నారు.