గతంలో ఎన్నో సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల అస్త్రాన్ని ఎక్కుపెట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.
ఇలాంటి కష్ట సమయంలో 1088 అత్యాధునిక అంబులెన్సులను ఎమెర్జెన్సీ సర్వీసుల కోసం అందుబాటులోకి తేవడం నిజంగా అభినందనీయమని పవన్ కళ్యాణ్ కొనియాడారు. అలాగే కరోనాను ఎదుర్కునే విషయంలో అలసత్వం ప్రదర్శించకుండా సత్వరమే టెస్టులు చేస్తున్న వైనాన్ని కూడా మెచ్చుకున్నారు. ఇలాంటి కష్ట పరిస్థితులలో ప్రభుత్వ పనితీరు బాగుందని ప్రశంసించారు. అలాగే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇది ప్రపంచానికే గడ్డుకాలమని, అందరం కలిసి ఎదుర్కొందామని అన్నారు.