Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి మైలేజ్ వచ్చే నిర్ణయాన్ని తాజాగా తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. విషయంలోకి వెళ్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ.. పవన్ కళ్యాణ్ పోరాటానికి రెడీ అయినట్లు ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఇప్పటికే వైసిపి నాయకులు ప్రయత్నాలు చేసినట్లు కేంద్ర మంత్రులను కూడా కలిసినట్లు.. చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో ఖచ్చితంగా ఒప్పిస్తారని.. తాజాగా నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్టీల్ప్లాంట్ పోరాటం విషయంలో అసలుసిసలైన పవన్ కళ్యాణ్ ని.. చూస్తారని తెలపటంతో జనసేన పార్టీ కార్యకర్తల లో నాయకుల జోష్ నెలకొంది. ఈ విషయంలో ఇప్పటికే పార్టీ నాయకులు ఓపిక పట్టడం జరిగిందని కాని పరిస్థితులు మారకపోవడం తో.. ఇక పోరాటమే కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ వచ్చే… నెలలో విశాఖ లో పర్యటించి కార్మికులతో చర్చిస్తారని తెలిపారు. ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చర్చించడం జరిగిందని స్పష్టం చేశారు.
ఏపీలో అధికార పార్టీ పై పోరాడటానికి ఇతర పార్టీలు భయపడుతున్నాయి కానీ జనసేన ఆ విధంగా భయపడే పార్టీ కాదని.. కచ్చితంగా పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేసే విషయంలో కేంద్రాన్ని ఒప్పించే దిశగా.. అడుగులు వేస్తున్నారని స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకుని కి పవన్ కళ్యాణ్ కి .. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోరాటం ఒక మైలురాయి అవకాశమని పొలిటికల్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.