Pawan kalyan : వకీల్ సాబ్ తో ఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రీఎంట్రీ తర్వాత వరుసగా భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ తో భారీ హిట్ అందుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ ఉత్సాహంతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టి సమాంతరంగా సినిమాల షూటింగ్ లో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకున్నాడు. మలయాళ హిట్ రీమేక్ అయ్యప్పనుమ్ కోషియం అలాగే హరిహర వీరమల్లు సినిమాలు దాదాపు 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసాడు. దాంతో ఈ సినిమాను 2021లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇది పవన్ అభిమానులకు టన్నుల కొద్దీ ఉత్సాహాన్ని ఇచ్చింది.
కానీ కరోనా వల్ల షూటింగ్ దశలో ఆగిపోవడంతో ఆయన చేస్తున్న రెండు సినిమాల రిలీజ్ డేట్ తారుమారయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. క్రిష్ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ లో స్టార్ మేకర్ ఏ.ఎం.రత్నం దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న వీరమల్లు సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు. ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో పోటీ ఉంటుందని అటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇటు మహేష్ అభిమానులు భావించారు. కానీ ఆ వార్ ఉండే అవకాశాలు దాదాపు లేవనిపిస్తోంది.
Pawan kalyan : ఏకే రీమేక్ తో సర్కారు వారి పాటకు పోటీ ఉండబోతోంది.
కానీ పవన్ తో మహేష్ మాత్రం పోటీ పడటం గ్యారెంటీ అని తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే వస్తుందనుకున్న ఏకే రీమేక్ 2022 లో పెద్ద పండుగ అయిన సంక్రాంతి కి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అంటే ఏకే రీమేక్ తో సర్కారు వారి పాటకు పోటీ ఉండబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఏకే రీమేక్ రూపొందిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న రెండు సినిమాలు జూన్ 24 నుంచి తిరిగి షూటింగ్ మొదలయ్యాయి. జూలై లో ఏకే రీమేక్ కూడా మొదలు పెట్టబోతున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – మాటలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!