పవన్ కళ్యాణ్ – రానా హీరోలుగా భారీ మల్టీస్టారర్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోషియం కి అఫీషియల్ గా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ – రానా నటిస్తున్నట్టు కూడా వెల్లడించారు. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
ఇటీవలే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా వకీల్ సాబ్ తర్వాత మొదలవ్వాల్సిన సినిమా ఇదే కాగా ఈ సినిమాలో కొంతమంది నటుల ఎంపిక ఇంకా పూర్తి కాని కారణంగా షూటింగ్ డేట్ పోస్ట్ పోన్ అవుతుందని భావించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ టైం వేస్ట్ చేయకుండా క్రిష్ సినిమా చేయాలనుకున్నాడు. అందుకోసం దాదాపు 40 రోజులు డేట్స్ కూడా ఇచ్చాడట. దాంతో జనవరి 4 నుంచి పవన్ కళ్యాణ్ – క్రిష్ ల సినిమా సెట్స్ మీదకి వస్తుందనుకున్నారు.
కాని క్రిష్ కరోనా బారిన పడటంతో ఇప్పుడు మళ్ళీ ప్లాన్ మారి పవన్ కళ్యాణ్ – రానా ల సినిమానే మొదలు పెట్టబోతున్నారట. ఈ క్రమంలో ఈ సినిమా సంక్రాంతి తర్వాత మొదలు కానుందని లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. సంక్రాంతికి టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.