Pawan Kalyan: సాయి ధరమ్ తేజ్ నటించిన “రిపబ్లిక్” సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు. సినిమా టికెట్ల వ్యవహారం విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని.. పవన్ మండిపడ్డారు. తన మీద కోపంతో ఏపీలో సినిమాలు ఆపేస్తే ఇండస్ట్రీలో లక్ష మంది పొట్ట కొడుతున్నట్లు సీరియస్ కామెంట్లు చేశారు. తన మీద కోపంతో సినిమా ఇండస్ట్రీ పై అక్కసు వద్దు.. అంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు.
సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ల కేటాయింపు విషయంలో.. అదే రీతిలో ప్రభుత్వాలతో మాట్లాడే దాని విషయంలో… ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదని ఈ విషయంలో చిరంజీవి గారికి కూడా తెలపండి ఆయన మంచి మనసుతో భయపడతారు ఎట్టి పరిస్థితుల్లో ఇది హక్కు ఎవరిని.. బతిమాలి వలసిన అవసరం లేదని మండిపడ్డారు. మొత్తంమీద “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ వేడుకలో చాలా వరకు పవన్ కళ్యాణ్ సినిమా గురించి కంటే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని… విమర్శలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు అర్థమవుతోంది.
ఇదే టైమ్లో సినిమా థియేటర్ల యాజమాన్యాలు హీరో నానిని విమర్శించడాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. సినిమా ధియేటర్ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. ఏది ఏమైనా.. “రిపబ్లిక్ ” రిలీజ్ వేడుక ఒక సినిమా వేడుక మాదిరిగా కాకుండా.. ఒక రాజకీయ పార్టీ మీటింగ్ మాదిరిగా ఉందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో భారీ స్థాయిలో కామెంట్లు వస్తున్నాయి.