పవన్ కళ్యాణ్ ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని చాతుర్మాస్య దీక్షను చేపట్టిన సంగతి తెల్సిందే. అన్ని సినిమాలు సెట్స్ మీదకి వస్తున్నప్పటికి ఈ దీక్ష వలనే పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు మాత్రం మొదలవలేదు. కాగా ఇటీవలే పవన్ కళ్యాణ్ చేపట్టిన చాతుర్మాస్య దీక్ష పూర్తయిందట. ఈ క్రమంలో వరసగా ఆయన కమిటయిన సినిమాలని ఒక్కొక్కటిగా సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నారట.
ముందుగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్ వకీల్ సాబ్ ని పూర్తి చేయబోతున్నాడని సమాచారం. కేవలం పవన్ కళ్యాణ్ నటించాల్సిన సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉండటంతో 15 రోజులు ఈ సినిమా కోసం కేటాయించనున్నాడట. ఈ 15 రోజులతో వకీల్ సాబ్ చిత్రీకరణ మొత్తం కంప్లీటవుతందని తెలుస్తుంది.
నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాశ్ రాజ్, సీనియర్ నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర కియోషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తునడగా బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సమర్పిస్తున్నారు.
కాగా ఈ సినిమా షూటింగ్ నవంబర్ 1 నుంచి మొదలవబోతుందట. అంతేకాదు ఈ షెడ్యూల్ లో శృతి హాసన్ కూడా పవన్ తో పాటు పాల్గొనబోతుందట. కాగా దిల్ రాజు ఈ సినిమాని సంక్రాంతి కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుండగా త్వరలో వకీల్ సాబ్ నుంచి టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ కనిపించేది కాసేపే అయినా రెమ్యూనరేషన్ మాత్రం భారీగానే అందుకుంటుందని తెలుస్తుంది.