ఒంగోలు, మార్చి 5 : అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు అంతా నాయకులు కావచ్చు కానీ, ప్రతికూల పరిస్థితుల్లో నిలబడే వాడే తన దృష్టిలో నిజమైన నాయకుడని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని బృందావన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో జనసేన కార్యకర్తలకు పవన్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీకి అభిమానులు ఎంత బలమో, ఒక్కోసారి అంతే బలహీనత కూడా అవుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. కట్టలు తెంచుకున్న అభిమానం పాల పొంగులాంటిది కారాదని పవన్ సూచించారు.
తాను హీరోగా ఎదిగిన తర్వాత కూడా 2009లో ఎంపీగానో ఎం ఎల్ ఏగానో పోటీ చేసి నాయకుడిని అయిపోవాలని ఆశపడలేదని పవన్ అన్నారు. తన కంటే అనుభవం ఉన్న వ్యక్తి ముందుకు వెళ్తుంటే వెనుక నుంచి తన వంతు తోడ్పాటు అందించానని, జనసైనికులు చేయాల్సింది కూడా అదేనని పవన్ సూచించారు.
ఎన్నో ఏళ్లుగా ఈ కుళ్లు రాజకీయాలను భరిస్తూ, సరైన ప్లాట్ ఫాం లేక ముందుకు రాలేకపోయిన జడ్జిలు, ఆఫీసర్లు, వ్యాపారవేత్తలు, మేధావులు, విలువలు, అనుభవం ఉన్న నాయకులు తమ కోసం వచ్చారని పవన్ తెలిపారు. వారికి మనం వెనుక ఉండి మద్దతు ఇస్తేనే మనం కోరుకుంటున్న మార్పు సాధ్యపడుతుందని, అలా చేయలేకపోతే మన బలం ఒక చిన్న దారపుపోగే అవుతుందని పవన్ అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?