అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009 ఎన్నికలలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. చిరంజీవి ఇండస్ట్రీ లో తిరుగులేని హీరో కావటంతో ఆ సమయంలో ఆయన ప్రచారం కార్యక్రమాలకు వచ్చిన జనాన్ని చూసి చాలామంది నెక్స్ట్ ముఖ్యమంత్రి చిరంజీవి అని డిసైడ్ అయ్యారు. ఫలితాలు వచ్చాక చూస్తే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. అయితే వైయస్ మరణించటంతో పరిస్థితులన్నీ మారటంతో కాంగ్రెస్ పార్టీలోకి విలీనమైంది ప్రజారాజ్యం పార్టీ. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ ఎక్కువగా సినిమాల్లో రాణిస్తున్నారు చిరంజీవి. ఇదిలా ఉండగా తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పరిస్థితి కూడా చాలా వరకు అధ్వానంగా ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినపడుతున్నాయి.
ఇది కేవలం భజన పార్టీ అని ప్రత్యర్ధులు అంటున్నారు. పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం బీజేపీతో రాజకీయాలు చేస్తున్న జనసేన కి ఎన్ని కష్టాలు ఎదురు అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీతో జత కట్టే ఆలోచనలో పవన్ కళ్యాణ్ వున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీతో చేతులు కలిపిన పవన్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఆలోచన రావడానికి గల కారణం.. ఏపీ బీజేపీ నేతలు అని టాక్ వస్తుంది. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ ఎవరినీ సంప్రదించకుండా ఏపీ బీజేపీ నేతలు చేసిన తీరు పవన్ కళ్యాణ్ కి నాచటం లేదని అందువల్ల ఆయన బిజెపి పార్టీకి తెలిపిన మద్దతు ఉపసంహరించుకుని కాంగ్రెస్ తో అడుగులు వేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.