పవర్స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ వెండితెరకు విరామం ఇచ్చిన తర్వాత కళామతల్లికి ఏదో వెలితి.. అభిమానుల మనసుల్లో నిరాశ నిండుకున్నాయి. ఇక రాజకీయ జీవితంలో అడుగుపెట్టిన ఈ క్రేజీ స్టార్ అక్కడ ఆశించిన అంచనాలను అందుకోలేక పోయినా ప్రజల మనసుల్లో అంతులేని అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇంతగా నటనకు లాంగ్ గ్యాప్ ఇచ్చినా ఆయనపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఇటీవల సోషల్ మీడియాలో ఆయనకు వచ్చిన బర్త్ డే విషెస్ చూస్తేనే తెలుస్తుంది. చిత్ర పరిశ్రమకు చెందిన వారినుండి, సామాన్య జనం వరకు పవర్ స్టార్ కి ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలిపారు. ఒకరకంగా పవన్ అభిమానులకు ఈ బర్త్ డే చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఇదే సమయంలో ఒకేసారి నాలుగు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రావడం అభిమానులకు మరింత కిక్కు ఇచ్చింది. గత కొంత కాలంగా నిరాశలో ఉన్న అభిమానులను, వెండితెరను.. పుల్ జోష్లో నింపడానికి 2021లో పవన్ సరికొత్తగా అడుగులు వేయబోతున్నాడు. ఇందులో భాగంగా వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ ఏండింగ్ లో ఉంది. ఇక డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించనున్న సినిమా కూడా తొందరగానే పూర్తవుతుంది. అంటే 2021మొదట్లో వకీల్ సాబ్ ఆ తరువాత సమ్మర్ లో క్రిష్ సినిమాను రిలీజ్ చేయాలని పవన్ ఆలోచిస్తున్నాడు.
అంతేకాకుండా సమ్మర్ లో గబ్బర్ సింగ్ డైరెక్ట్ హరీష్ శంకర్ సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే కరోనా తగ్గితే వెంటనే ఈ ప్లాన్ ను అమలుపరిచి అనుకున్న సమయానికి సినిమాలను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడని సమాచారం.. అదీగాక కుదిరితే వచ్చే ఏడాదే సురేందర్ రెడ్డి సినిమాను కూడా స్టార్ట్ చేయవచ్చు. కానీ ఆ సినిమా 2022లోనే వచ్చే అవకాశం ఉందట. ఈ విధంగా పవన్ కళ్యాణ్ భారీ ప్లాన్ అభిమానుల్లో అంచనాల డోస్ ని ఆకాశానికి పెంచుతోంది. మరి ఎంతవరకు పవన్ సినిమాలు సక్సెస్ అవుతాయో చూడాలి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!