Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దగ్గుబాటి రానా తో కలసి “అయ్యప్పన్ కోషియం” అనే మలయాళం సినిమానీ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో పవన్ సరసన నిత్యమీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో పక్క మ్యూజిక్ తమన్ అందిస్తున్నారు. ఈ సినిమా మలయాళంలో బీభత్సమైన హిట్ కావడంతో తెలుగులో రానా పవన్ మొట్టమొదటిసారి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు బీభత్సంగా నెలకొన్నాయి.
ముఖ్యంగా కీలక సన్నివేశాలు విషయంలో త్రివిక్రమ్ ఐడియాలను సాగర్ కే చంద్ర ఫాలో అవ్వటం మాత్రమే కాక సినిమాకి త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే డైలాగ్స్ రచన అందించడంతో మరింతగా సినిమాపై పవన్ అభిమానులకు ఇంట్రెస్ట్ నెలకొంది. ఇటీవల పవన్ లుక్ రిలీజ్ చేయడంతో సినిమాలో పవన్ అప్పటి గబ్బర్సింగ్ మాదిరిగా ఉన్నట్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో భారీగా రెస్పాండ్ అయ్యారు. ఎలా అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే హిందీ హక్కుల విషయంలో.. 23 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి.
కేవలం పవన్ కళ్యాణ్ క్రేజ్ మూలంగా ఇంత భారీ ధరకు.. హిందీ రైట్స్ అమ్ముడయినట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా స్పీడ్ గా అవుతూ ఉండడంతో త్వరలోనే సినిమా రిలీజ్ ఉన్నట్లు భావిస్తున్నారు. కరోనా కారణంగా సినిమా అనుకున్న సమయానికి కంటే ఇప్పటికే ఆలస్యం కావడంతో ఎట్టి పరిస్థితిలో సినిమా త్వరగా కంప్లీట్ అయ్యేలా..డైరెక్టర్ లకు నిర్మాతలకు పవన్ సీరియస్ ఆదేశాలు జారీచేసినట్లు ఇండస్ట్రీ టాక్.