సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల హైబీపీతో హైదరాబాద్ నగరంలో అపోలో ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగింది. సరిగ్గా పొలిటికల్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టే సమయంలో రజినీకి అస్వస్థత రావటం ఆయన అభిమానులకు కలవరం పుట్టించింది. అంత మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది సినీ ప్రముఖులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు అయింది.
ఇటువంటి తరుణంలో తలైవా త్వరగా కోలుకోవాలని తమిళనాడు వ్యాప్తంగా ఉన్న అభిమానులు భారీ స్థాయిలో పూజలు చేస్తూ భగవంతునికి ప్రార్థించారు. ఇదిలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రజినీకాంత్ ఆరోగ్యంపట్ల మోహన్ బాబు, చిరంజీవి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆ కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తూ ఉన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా రజనీకాంత్ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు కమలహాసన్ భగవంతునికి ప్రార్థించారు. అయితే తాజాగా డిసెంబర్ 26వ తారీకు మళ్లీ బిపి పరీక్షలు నిర్వహించగా.. అన్ని రిపోర్టులు నార్మల్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఎందుకైనా మంచిది అని మరోసారి పరీక్షలు నిర్వహించి ఒక్కసారిగా రజిని డిశ్చార్జ్ చేయడానికి అపోలో వైద్య సిబ్బంది రెడీ అయినట్లు సమాచారం.