Pawan Rana: ఫస్ట్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రానా దగ్గుబాటి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం సూపర్ హిట్ సినిమా “అయ్యుపన్ కోశియం” ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగులు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయినట్లు.. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న టాక్. కరోనా కారణంగా షూటింగ్ కి మొన్నటి దాక బ్రేక్ పడగా.. జూలై రెండోవారంలో మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసి ఏకధాటిగా.. ప్రస్తుతం చిత్రీకరిస్తూ వస్తున్నారు.
సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా రానా…. మిలట్రీ నుంచి గ్రామానికి వచ్చిన సోల్జర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలె పవన్ కళ్యాణ్ కి సంబంధించి.. సినిమాలో పోలీస్ లుక్… సినిమా యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది. గబ్బర్ సింగ్ సినిమా లో ఉన్నట్టు పవన్ లుక్.. ఉందని సోషల్ మీడియాలో అభిమానులు తెగ కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా లో మొత్తం 3 పాటలు.. అందిస్తున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ తాజాగా తెలియజేశారు.
ఈ మూడింటిలో ఒక పాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేత పాడించడం జరుగుతుందని స్పష్టం చేశారు. జానపద నేపథ్యంలో ఆ తరహాలో పాట ఉంటున్నట్లు సినిమా యూనిట్ నుండి అందుతున్న టాక్. చాలాకాలం తర్వాత మళ్ళీ పవన్ తన గొంతు కి పని చెబుతూ ఉండటంతో ఈ వార్త తాజాగా సోషల్ మీడియాలో రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమాకి సంబంధించి షూటింగ్.. చాలా త్వరగా కంప్లీట్ చేయడానికి పవన్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గతంలో జానీ, గుడుంబా శంకర్, అత్తారింటికి దారేది..సినిమాలలో పాటలు పాడటం జరిగింది. మళ్లీ చాలాకాలానికి పవన్ పాట పాడటానికి రెడీ అవ్వడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.