కరోనా వైరస్ రావడంతో దాదాపు ఎనిమిది నెలల పాటు హైదరాబాద్ నగరానికి పరిమితమైన పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీలో అడుగుపెట్టారు. మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీకి చెందిన నాయకులతో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చినా వాళ్ల తాలూకు అంతిమ లక్ష్యం వేలకోట్లు కూడగట్టుకోవడానికో, పదవులు సంపాదించడానికో కాదు ప్రజలు ఏవైతే కోల్పోయారో వాటిని అందజేయడానికి అంటూ స్పష్టం చేశారు.
అందుకే జనసేన పార్టీ పుట్టింది అని, ప్రజలకు అందజేయడానికి జనసేన స్థాపించినట్లు పవన్ పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాలలో విమర్శలు వ్యక్తిగతం కి సంబంధించినవిగా ఉంటున్నాయని… అసలు సమస్యపై మాట్లాడే నాయకులు గానీ రాజకీయ వాతావరణం గాని లేదంటూ స్పష్టం చేశారు. ఎన్నికలలో ఓడిపోతే పారిపోయే వాళ్ళం కాదని పేర్కొన్నారు. ఖచ్చితంగా ప్రజా సమస్యలపై పోరాడే నిలబడతామని స్పష్టం చేశారు.
ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నట్లు క్యాడర్ కి దిశానిర్దేశం చేశారు. అదే విధంగా ఈ పర్యటనలో అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన మహిళా రైతులు చేస్తున్న దీక్ష వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు. ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్రం కోసం భూములు ఇచ్చిన మీరు ఇలా ఆందోళనలు చేయడం బాధాకరమన్నారు. కాగా దాదాపు ఎనిమిది నెలల తర్వాత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అడుగుపెట్టడంతో పార్టీ కేడర్ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.