2014 ఎన్నికల సమయంలో పార్టీని స్థాపించి 2019 ఎన్నికలలో మొట్టమొదటిసారి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. పార్టీ స్థాపించిన తర్వాత టిడిపి- బిజెపితో కలసి అడుగులు వేసిన పవన్, 2019 ఎన్నికలకు ఏడాది ముందు ఆ కూటమి వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత సొంతంగా 2019 సార్వత్రిక ఎన్నికలలో తన శక్తి మేర రాణించి జనసేన పార్టీకి ఒక స్థానం వచ్చేలా వ్యవహరించడం జరిగింది. కానీ ఆ సమయములో పవన్ ఓడిపోవడంతో జనసేన శ్రేణులు, అభిమానులు ఎంతో బాధ పడటం జరిగింది.
కాగా తర్వాత ఇటీవల బీజేపీ తో చేతులు కలిపిన పవన్ తర్వాత… ఫోకస్ ఎక్కువగా సినిమాలపైనే పెట్టడం జరిగింది. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలు బట్టి చూస్తే 2022 వరకు షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉన్నట్లు ఫిలిం నగర్ టాక్. “వకీల్ సాబ్” తరువాత డైరెక్టర్ క్రిష్, హరీష్ శంకర్ అదేవిధంగా సురేందర్ రెడ్డి సినిమాలు పూర్తి చేసిన తర్వాత కానీ పవన్ రాజకీయంగా పూర్తిగా బిజీ కాబోతున్నారట.
అప్పటివరకు పవన్ ఎక్కువగా సినిమాలపైనే దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సార్వత్రిక ఎన్నికల సమయంలోనే పార్టీ నిర్మాణాత్మకంగా లేకపోవడంతోనే ఫలితాలు ఆ విధంగా రావడం జరిగాయి. అయితే ఈ రెండు సంవత్సరాలలో పార్టీని కాపాడుకోలేక పోతే సంస్థాగతంగా నిర్మాణం చేపట్టకపోతే జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ కంటే అట్టర్ ఫ్లాప్ అవడం గ్యారెంటీ అని పవన్ తాజాగా వ్యవహరిస్తున్న తీరుపై పార్టీలో అంతర్గతంగా చర్చలు మొదలైనట్లు టాక్.