దుబ్బాక ఉప ఎన్నికలలో బిజెపి గెలవడంతో గ్రేటర్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ఈ ఎన్నికలను బిజెపి నాయకులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కచ్చితంగా వంద స్థానాలకు పైగానే గ్రేటర్ ఎన్నికలలో బిజెపి కి రావటం గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క జనసేన పార్టీ తరఫున అభ్యర్థులు కూడా గ్రేటర్ పరిధిలో పోటీచేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మిత్రపక్షా నాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ప్రచారంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ఉండే కాపు సామాజిక వర్గానికి చెందిన చాలామంది నేతలు పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉన్నట్లు దీంతో బీజేపీ సమావేశం ఎప్పుడు ఎలా జరుగుతుంది వంటి విషయాలపై క్లారిటీ ఇస్తే సూచనలు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ రెడీ అయినట్లు తెలంగాణ రాజకీయాల్లో టాక్.
గ్రేటర్ పరిధిలో చాలా ప్రాంతాలలో జనసేన పార్టీకి బిజెపి మద్దతు ఇవ్వనున్నట్లు దీంతో జనసేనకి ఓట్లు పడే అవకాశాలు ఉండొచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇటువంటి తరుణంలో బండి సంజయ్… పవన్ తో కలసి ప్రచారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు వీరిద్దరూ కలసి ఏ విధంగా రాబోయే రోజుల్లో వ్యవహరిస్తారు అనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఏవిధమైన విమర్శలు ఎవరిపై చేస్తారో అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.