ఎట్టకేలకు పవన్ ఏపీ మూడు రాజధానులు విషయమై మరియు అమరావతి రైతుల పరిస్థితి పై కామెంట్ చేశారు. కృష్ణ మరియు గుంటూరు జిల్లాలకు చెందిన టిడిపి, వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని పై చిత్తశుద్ధి ఉంటే పదవులు వదిలేసి ప్రత్యక్ష పోరాటం చేయాలని డిమాండ్ చేశాడు.
ఇక టిడిపి లక్షకోట్ల రాజధాని అన్నప్పుడు… వైసిపి మూడు రాజధానులు అన్నప్పుడు జనసేన ప్రమేయం వాటిలో ఏమీ లేదని స్పష్టం చేశారు. అమరావతి రైతులు ప్రశ్నించాల్సింది ఈ రెండు ప్రధాన పార్టీలనే అని ఆయన అన్నారు. మరి ఇన్ని చెప్పిన పవన్ అమరావతి కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నారని గతంలో అన్నారు. మరి ఆ విషయంపై ఇప్పుడు ఎలాంటి కామెంట్ ఎందుకు చేయడం ప్రజల్లో కొత్త ప్రశ్నలు తలెత్తాయి.
జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మూడు రాజధానులు ప్రపోజ్ చేశారు అని…. వైసీపీ, టిడిపి రాజకీయాలకు రైతు బలైపోతున్నాడు అని అన్న పవన్ కళ్యాణ్ ఆ పరిస్థితిని చక్కబెట్టేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మొన్న ఏపీ బీజేపీ ఈ విషయంలో తమకేం సంబంధం లేదని….
అసలు ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందని వ్యాఖ్యానించడం వెనుక అంతరార్ధం ఏమిటో ప్రజలకు చెప్పాలని ఇప్పుడు ఈ రెండు ప్రధాన పార్టీల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అమరావతి విషయానికి బాధ్యతగా వైసీపీ ఎమ్మెల్యేలు, టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం మాట కి లింక్ చేస్తూ ఇప్పుడు బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్నా కూడా… అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ లెక్క ప్రకారం పవన్ కళ్యాణ్ బిజెపి నుండి విడిపోవాలి కదా…. అతను కూడా అందుకు బాధ్యత తీసుకోవాలి కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం డిమాండ్ చేసే పరిస్థితిలో పవన్ లేడని… బిజెపి పార్టీ ఎటు మాట్లాడమంటే అటు మాట్లాడే బొమ్మ లాగా మారిపోయారని తీవ్రమైన ఆరోపణలు రాష్ట్రం నలుమూలల నుండి వస్తున్నాయి. మరి టిడిపి, వైఎస్ఆర్సిపి చిత్తశుద్ధి గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ అసలు తన పార్టీ అజెండా…. బిజెపి పార్టీ జెండా వేరువేరని స్పష్టంగా ఎప్పటికి తెలియజేస్తారు..?