Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర విభాగానికి చెందిన కార్యకర్తలతో ఈరోజు సమావేశమయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ జనసేన పార్టీ కీలక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ పోరాట స్ఫూర్తి.. యే.. జనసేన పార్టీని స్థాపించి అలా చేసిందని ఉద్యమ స్ఫూర్తితో.. తాను రాజకీయాల్లోకి రావడం జరిగిందని చెప్పుకొచ్చారు. చుట్టుపక్కల మార్పు రావాలి అని కోరుకుంటాను కానీ అందులో అడుగు పెడితే తప్ప అనుభవం రాదని పవన్ స్పష్టం చేశారు. ” రాజకీయాల్లోకి వచ్చాక గెలుస్తామా ఓడిపోతానేమో లేక ప్రాణాలు పోతాయో నాకు తెలియదు. నేను మాత్రం పోరాడుతూనే ఉంటాను.
రాజకీయాల్లోకి రావాలనుకుంటే టైంలో చాలామంది భయపెట్టారు.. కానీ వాటినన్నిటిని చేయించుకుని బలమైన సామాజిక మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను. అదే రీతిలో డబ్బులతో కొనలేని సరికొత్త తరాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలన్నది నా ఆశయం. రాజకీయాల్లో నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పనే కాని అన్నింటికీ తెగించి మరి.. రాజకీయాల్లోకి రావడం జరిగింది అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో కులాలు మతాలు రంగు ప్రాంతం… ప్రస్తావన అసలు ఉండకూడదు కులాలను రెచ్చగొట్టే విధంగా రాజకీయ నాయకులు మాట్లాడకూడదు.
2009 ఎన్నికల టైంలో
ఏపీలో అభివృద్ధి దిగజారిపోయింది అభివృద్ధిని అడ్డుకునే ఎటువంటి రాజకీయ నాయకులకు అయినా తనకి బద్ధ శత్రువులు అంటూ పవన్ స్పష్టం చేశారు. 2009 ఎన్నికల టైంలో తెలంగాణ లో హైదరాబాదు మొదలుకొని ఆదిలాబాద్ వరకు తిరిగిన వాడిని.. ఆ టైం లో పార్టీ తన అధీనంలో లేదని.. పరోక్షంగా పిఆర్పి గురించి పవన్ స్పష్టం చేశారు. రాజకీయాలలో దెబ్బకొట్టే కోద్ది… ఎదురు వెళ్ళడమే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. గెలుస్తానని రాజకీయాల్లోకి రాలేదు దెబ్బ పడ్డది అని తెలిసే.. రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు పవన్ తెలిపారు.
ఏపీలో మార్పు మొదలైంది
అయినా కానీ ఈ సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తానని.. ఎన్ని అడ్డంకులు పోరాటాలు వచ్చినా ఒదిగే పయనం సాగుతోందని.. ఏపీలో వేలల్లో ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలు జనసేన పార్టీ ఇటీవల గెలవడం జరిగింది అని మార్పు మొదలైంది అని తెలిపారు. అదే రీతిలో తెలంగాణలో కూడా జనసేన పార్టీ నీ… అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తానని పవన్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.