అమరావతి: టీడీపీ ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఏపీ అసెంబ్లీలో పయ్యావుల అధ్యక్షతన పీఏసీ భేటీ జరిగింది. సమావేశం జరుగుతుండగా ఆయనకు వాంతులయ్యాయి. వెంటనే ఆయనను అసెంబ్లీలోని డిస్పెన్సరీకి తరలించి చికిత్స అందించారు. వైద్య చికిత్స అనంతరం ఆయన కొంతమేర కోలుకున్నారు. స్వల్ప అస్వస్థతేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు. మరోవైపు మెరుగైన వైద్యం కోసం ఆయనను విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు.
previous post
next post