Peddireddy – Nimmagadda: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూనే ఉంటారు… ఆయన నిమ్మగడ్డను – Peddireddy – Nimmagadda పదే పదే చెబుతూనే ఉంటారు… చంద్రబాబు మనిషిని గొంతెత్తి గట్టిగా నినదిస్తారు… ఎన్నికల కమిషన్ చేస్తున్న ప్రతి తప్పును వేలెత్తి చూపుతారు… ఎన్నికల నిర్వహణ విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరిగిన కరోనా విషయంలో మళ్లీ ఏ మాత్రం కేసులు పెరిగిన వెంటనే పెద్దిరెడ్డి నోటికీ పని చెబుతారు… అంతటికీ కారణం ఎన్నికలు ఎన్నికల కమిషనర్ కోణంలో ఆయన మాటల జడి ప్రత్యక్షంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైపే ఉంటుంది… ఈ విషయంలో మరే నాయకుడు కలగ చేసుకోడు. ఈ విషయంలో వేలు పెట్టరు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా విమర్శించి టిడిపి వ్యక్తిగా చిత్రీకరించే బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దే.. మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలను చూస్తున్న పెద్ద రెడ్డికి ఈ అదనపు బాధ్యతలను సైతం జగన్ అప్పగించారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల కమిషన్ కు దీటుగా ఎప్పటికప్పుడు పెద్ద రెడ్డి ప్రెస్ మీట్ లు జరుగుతూనే ఉంటాయి. ప్రతిసారి ఒకటే ఎజెండా నిమ్మగడ్డ రమేష్ కుమార్… ఆయన చేస్తున్న పనులు… ఆయన టిడిపి వ్యక్తి చంద్రబాబు దగ్గర వ్యక్తి అని ఎత్తి చూపడమే. ఇదో పెద్ద టాస్క్.
చివరి వరకు నిమ్మగడ్డ ను వదలరు!!
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ను పదేపదే మంత్రి హోదాలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించడం… రిటైర్ అయిపోయిన వ్యక్తిగా అభివర్ణించడం అన్ని ఒక మెంటల్ స్ట్రాటజీ లో భాగం. పంచాయతీ ఎన్నికల్లో ఏ మాత్రం తప్పులు దొర్లిన కరుణ విషయంలో మరోసారి కేసులు పెరిగినా దానికి కారణం నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఎత్తి చూపడమే పెద్ద రెడ్డి లక్ష్యం. న్యాయపరంగా పంచాయతీరాజ్ ఎన్నికలను లేకపోయినా ప్రభుత్వం దానికి మొత్తం వెనకుండి చంద్రబాబే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ఆట ఆడుతున్నారు ప్రజలకు తెలియపరచడమే అసలు రాజకీయ లక్ష్యం.
సింపతీ ముఖ్యం!
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్నికలు వద్దు అంది అని అయితే టీడీపీ అధినేత వెనకుండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ముందు పెట్టి ఎన్నికలు నిర్వహించడానికి కుట్ర చేశారు అని ప్రజలకు చెప్పే వారి వద్ద నుంచి సింపతీ పొందడమే లెక్క. దీంతో పాటు తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని సైతం ప్రజల దృష్టిలో విలన్ వైఎస్సార్సీపీ కార్యకర్తల దృష్టిలో ఒక రాక్షసుడు గా అభివర్ణించడా నికి వైస్సార్సీపీ నేతలు కంకణం కట్టుకున్నారు. ముఖ్యంగా జగన్ ఏకగ్రీవ మీద దృష్టి పెట్టి ఎన్నికల కమిషన్కు ఎలాంటి పని కల్పించకుండా వారిని కేవలం బొమ్మలు గా కూర్చుబెట్టి కథ నడిపించాలని భావిస్తున్నారు. దీనివల్ల ఎన్నికలు పెట్టిన మీరు విధులు నిర్వహించలేక పోయారు అని మొత్తం అన్ని ఏకగ్రీవాలు చేసుకున్నామని జగన్ ఎన్నికల కమిషన్ ముందు భుజాలు ఎగరేసే అవకాశం ఉంటుంది. ఇదే పద్ధతిలో ఇప్పుడు యాదాద్రి వాల్ లో ఏ మాత్రం తేడా వచ్చినా ఎలాంటి గొడవలు జరిగినా క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సిపి నాయకులు ఏకగ్రీవాలు కోసం ఎలాంటి పనులు చేసినా దానిని ఎన్నికల కమిషనర్ అడ్డుకుంటే దాని వెనుక చంద్రబాబు ఉన్నాడనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పొందడానికి ఈ మంత్రం పనిచేస్తుంది. ఒక రాజ్యాంగ వ్యవస్థ లో స్వతంత్ర వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్కు కమిషనర్గా ఉన్న వ్యక్తిని రాష్ట్రమంత్రి ఇష్టానుసారం వ్యాఖ్యానించడం విమర్శించడం… దానిని ప్రభుత్వం పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి సైతం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటం.. ఇవన్నీ రాజకీయ క్రీడలో ఓ భాగమైన రాజ్యాంగ వ్యవస్థలు దాడి తొక్కుతున్నాయి అనే సూచనా సంకేతం మాత్రం భవిష్యత్తు తరాలకు వెళ్తుంది అనడంలో సందేహం లేదు.