పెరటి జాం చెట్టు పాటైనా .. అక్కకు మొగుడు అయినందుకు పెళ్లి చేసే బాధ్యత నాదేదాన్న.. వియ్యాల వారి ఇంట్లో వంటల పాటలు పాడాలన్న.. పాటలతో పూనకాలు, పెళ్లి సందడి పుట్టించడం బహుశా ఈ సినిమా తోనే మొదలై ఉంటుందేమో.. పెళ్లి మర్యాద లో “కాఫీలు తాగారా.. టిఫినీలు చేశారా ” అంటూ సాగే కామెడీని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు.. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రభావం , ఎం.ఎం.కీరవాణి పాటల సందడి వెరసి సినిమా విడుదలైన వంద రోజుల పాటు ప్రతి ఇంట్లోను పెళ్లి సందడి నెలకొనట్లే ఉంది.. తెలుగు సినిమాల్లో, పాటలలో చెరగని ముద్ర వేసుకున్న “పెళ్లి సందడి” విడుదలయ్యి నేటికీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా ప్రత్యేక కథనం మీకోసం..!
రెండు జీవితాలను ఒకటి చేసి తుదివరకు సాగే ప్రయాణమే “పెళ్లి “.. అటువంటి పెళ్లిని ప్రధాన కథనం గా తీసుకుని తెలుగు తెరపై చాలా సినిమాలు సందడి చేశాయి.. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో లో వచ్చిన పెళ్లి సందడి సినిమా ఇప్పటికీ, ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.. శ్రీకాంత్ హీరోగా, రవళి దీప్తి భట్నాగర్ హీరోయిన్లు గా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా మా రెండు కుటుంబాలు , మూడు మనసులకు సంబంధించిన సంబంధించిన కథలా ఉంటుంది. పెళ్లి మర్యాద లో “కాఫీలు తాగారా.. టిఫినీలు చేశారా ” డైలాగ్ ను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ సినిమాలో ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం హైలెట్ గా చెప్పుకోవచ్చు. “సౌందర్య లహరి.. స్వప్న సుందరి..”ఈ పాట ఇప్పటికీ జనం గుండెల్లో జేగంట మోగిస్తూనే ఉంది. ఈ సినిమా మా ఆవిష్కరించిన తీరు అద్భుతం, అమోఘం.. అందుకే ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించింది. 1996 జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమా 25 సంవత్సరాల ను పూర్తి చేసుకుంది. శ్రీకాంత్ ని ఫ్యామిలీ హీరోగా నిలబెట్టడమే కాకుండా తిరుగులేని స్టార్ డమ్ ను తెచ్చిపెట్టింది.వంద సినిమాలను పూర్తి చేసేంత ప్రోత్సాహాన్ని పెళ్లి సందడి సినిమా అందించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ సినిమాలో కథానాయకుడైన విజయ్ కృష్ణ (శ్రీకాంత్) కు తరచూ కలలో ఒక అందాలరాశి కనిపిస్తూ కవ్విస్తూ ఉంటుంది . దాంతో అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అతను ఆరాట పడుతుంటాడు. ఒక పెళ్లి లో స్వప్న దీప్తి భట్నాగర్ చూసి తనే స్వప్న సుందరి అని తెలుసుకుంటాడు. అతని చూపుల చిక్కుముడి లో ఆమె హృదయాన్ని బంధిస్తాడు బంధించాడు దీంతో ఇద్దరూ ప్రేమించుకొంటారు ప్రకృతి రమణీయమైన లొకేషన్స్ లో విహరిస్తుంటారు . ఇంతలోనే విజయ్ కృష్ణ పెళ్లిని అతని తండ్రి కళ్యాణి ( రవళి) తో ఖరారు చేశాడు. ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే ఏమిటంటే స్వప్న, కళ్యాణి లు ఇద్దరు అక్కాచెల్లెళ్లు. ఇది తెలుసుకున్న స్వప్న తన అక్క పెళ్లి ఎలాగైనా జరిపించాలని విజయ్ కృష్ణ తో తనకు క్యాన్సర్ అని అబద్ధం చెప్పి పెళ్ళికి ఒప్పిస్తుంది. విజయ్ తో కళ్యాణి పెళ్లికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి . ఆఖరి నిమిషంలో స్వప్న ను ప్రేమించిన ఓ వ్యక్తి ద్వారా నిజం తెలుస్తుంది. దీంతో స్వప్న కు ఎలాంటి జబ్బులు లేదని తెలుసుకుంటాడు. విజయ్ స్వప్న లకు అదే ముహూర్తానికి తన అక్క కళ్యాణి దగ్గరుండి వివాహం వివాహం జరిపిస్తుంది. ఈ కథలో అక్కాచెల్లెళ్ల త్యాగం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఒకరి ఆనందం కోసం ఒకరు తమ సంతోషాన్ని పనంగా పెడతారు. ఈ కథలో వారి అందాలు, అనుబంధాలు, ఆనందాలు , ఆవేదనలు ఈ సినిమాను మరింత రక్తి కట్టించాయి.
ఇది కూడా చదవండి: ఆ ఇస్రో ఇంజనీర్ తెలివి అమోఘం.. ఆయన చేసిన అద్భుతం చూడండి