Social media: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఏపీ పంచాయతీ ఎన్నికల గురించి చర్చ జరుగుతుంది. నామినేషన్లు, పోలింగ్ లో రూలింగ్ పార్టీ మరియు అప్పోజిషన్ పార్టీలు నువ్వా నేనా అన్న రేంజులో పోటీపడుతున్నాయి. కొన్ని చోట్ల వైసీపీ దాడులు జరుగుతున్నాయి అంటూ అప్పోజిషన్ అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్ ను ఆశ్రయించి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియా Social media లో నామినేషన్ వేస్తున్న అభ్యర్థులు ప్రచార మాధ్యమంగా ఎంచుకున్న విధానం అందరిని ఆకర్షిస్తుంది.
ఇంతకు ముందు ఎన్నికలు అంటే అభ్యర్థి వెనుక చాలా మంది కార్యకర్తలు జండాలతో, పాంఫ్లెట్ లతో ఇంటింటికి వచ్చేవారు. కానీ ఇపుడు మరిన కాలంతో పాటుగా వీరి ప్రచార విధానం కూడా మారింది. ఏపీ లో పంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల రేంజులో జరుగుతున్న నేపథ్యంలో పల్లెల్లోని ప్రజలు సైతం తమకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ ని ఉపయోగించి తమ తమ ఎన్నిక ప్రచారం చేస్తున్నారు. తాజాగా వాట్సాప్ మరియు ఫేస్ బుక్ మాధ్యమం గా చేసుకుని అభ్యర్థులు కోత్త గ్రూపులు క్రియేట్ చేసుకుని అందులోనే ప్రచారం చేస్తున్నారు.
ఈ తరం యువత ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా లో తాము చేసిన అభివృద్ధిని, ఆ ప్రాంతం లో ఉన్న సమస్యలను వివరిస్తూ తాము ఏ విధంగా ముందుకి వెళ్ళాలి అనుకుంటున్నారో వీడియో రూపంలో సోషల్ మీడియా లో పోస్ట్ చేసేస్తున్నారు. మొత్తం ఆంధ్ర అంతా ఇదే ట్రెండ్ నడుస్తోంది.
తమ తమ మేనిఫెస్టో లను కూడా వారు వాట్సాప్ గ్రూప్ ల లోనే వేసేస్తున్నారు. అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎన్నికలలో పోటీ చేస్తున్న దాదాపు 80 శాతం మంది అభ్యర్థులు ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నట్లు సమాచారం.