(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు గ్రామంలో రాజధాని అమరావతిపై ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని చేపట్టారు. పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ రామ్మోహన్ల ఆధ్వర్యంలో ఈ ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
అమరావతిని రాజధానిగా కొనసాగించాలా? మూడు రాజధానులు కావాలా? అనే అంశంపై టిడిపి ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తోంది. గ్రామస్తులు వారి అభిప్రాయాలను బ్యాలెట్ ద్వారా తెలియజేస్తున్నారు.