Air Conditioners: మారుతున్న వాతావరణం అలాగే అధిక వేడితో ఉంటున్న ఎండలు వలన ఎయిర్ కండీషనర్లు చాలా అవసరం అయ్యాయి. సాధారణంగా ఎండాకాలంలో ఏసీ వాడతాం కానీ ఈ మధ్య అన్నికాలాలలోనూ చాలా మంది ఏసీ ని ప్రిఫర్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సాఫ్ట్ వెర్ ఆఫీసులు, ప్రభుత్వ ఆఫీసులు, రెస్టారెంట్లు ఎక్కువగా ఏసీలను వాడుతున్నారు.
ప్రజలు బాగా ఏసీ కి అలవాటు పడిపోతున్నారు. అయితే, చాలా మందికి తెలియని నిజం ఏమిటంటే ఏసీలు అధికంగా వాడటం వల్ల కరోనా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందట. శాస్త్రవేత్తలు కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రారంభదశలోనే ఈ విషయాన్ని గుర్తించారట.
అప్పటిలో చైనాలోని గాంగ్జూలో అనే ప్రదేశంలో ఒక రెస్టారెంట్లో నుంచి వస్తున్న ఏసీ గాలి వలన పది మందికి కరోనా వైరస్ సోకిందని శాస్త్రవేత్తలు నిర్దారించారు. వెంటిలేషన్, ఎక్కువగా జనాభా గుమిగూడిన ప్రదేశాలలో శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరిపారు. ఇందులో భాగంగానే వారు చైనాలోని ఒక ప్రముఖ రెస్టారెంటులో పరిశోధనలు నిర్వహించగా ఏసీ వలన కరోనా వ్యాప్తి అధికంగా ఉందని నిర్థారించారు.
వీటిని పరిశీలించడానికి శాస్త్రవేత్తలు సూపర్ కంప్యుటర్ ల లో అడ్వాన్స్డ్ ఎయిర్ ఫ్లో ఉత్పత్తులను వినియోగించినట్లు తెలిపారు. అయితే ఈ పరిశోధనకు సంబంధించిన మొత్తం ఫలితాలను ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే జర్నల్ లో ప్రచురించారు. “మా పరిశోధనలో మేము ముఖ్యంగా ఎయిర్ కండీషనర్ల సామర్థ్యం, గాలి ప్రవాహం, ఏరోసోల్ వ్యాప్తి, వేడి ప్రభావం, వంటి విషయాలతో పాటుగా వైరస్ వ్యాప్తికి ఉపకరించే అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాం.” అని ఆ పరిశోధన లో సభ్యుడైన జియారోంగ్ హాంగ్ స్పష్టం చేశారు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.