Digital screens:అధిక సమయం ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ స్క్రీన్ టీవీ వంటివి చూడడం వల్ల కళ్ల మీద ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కళ్ళ దురదలు కళ్ళు నొప్పి , పుట్టడం నీరు కారడం, మంటలు రావడం వంటివి జరుగుతుంటాయి.ఈ సమస్యల కు రోజ్వాటర్ ను వాడితే కళ్లు తాజాగా ఉంటాయి. ఒక కాటన్ బాల్ ను తీసుకుని కొంచెం రోజ్వాటర్ లో ముంచి 15 నిమిషాల పాటు కళ్లు మూసుకుని కాటన్ బాల్స్ను కళ్లమీద పెట్టుకోవాలి . ఇలా చేస్తే కళ్ల అలసట తగ్గుతుంది.
రోజ్వాటర్లో ఉండే గుణాలు కళ్ళ నొప్పులు తగ్గేలా చేస్తాయి. మెదడు కణాలు ఉత్తేజితం చేయబడతాయి. కళ్లు ఎరుపెక్కినపుడు కంట్లో రెండు చుక్కల రోజ్వాటర్ వేసి 20 నిమిషాల పాటు కళ్లు మూసుకొని ఉంటే కళ్ళు ఎరుపు తగ్గి ప్రశాంతంగా ఉంటాయి .
అలాగే కంట్లోని మలినాలు, దుమ్ముధూళిని లేకుండా ఉండేందుకు కూడా రోజ్వాటర్ని ని వాడవచ్చు. కళ్ల కింద రోజ్వాటర్ రుద్దుకుంటే కళ్ల వాపు, కళ్ల కింద నల్లటి వలయాలుతగ్గుతాయి. ఈ విధం గా రోజ్వాటర్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆయుర్వేదం కూడా రోజ్వాటర్ కంటి సమస్యలకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది అని తెలియచేస్తుంది. బేబీ ఆయిల్ని తీసుకుని కళ్ల చుట్టూ మృదువుగా మసాజ్ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.
టమాటా రసాన్ని, నిమ్మరసాన్నిసమమం గా కలిపి కళ్ల చుట్టూ పూసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే కళ్ల కింద నలుపు తగ్గడం తో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది . ఈ మిశ్రమం రెండు రోజులకు ఒకసారి రాసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. కొబ్బరి నూనె చుక్కలు తీసుకుని కళ్ల చుట్టూ వలయాకారంలో రాస్తూ నెమ్మదిగా మసాజ్ చేస్తే కళ్ల కింద నలుపు తగ్గుతుంది.