Computers: ఈ రోజుల్లో ఎక్కువమంది వర్క్ చేసేది కంప్యూటర్ Computers తోనే.. వాటితో విడదీయరాని బంధం ఏర్పడింది ఎందుకంటే కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని వర్క్ చేయనిదే.. బతుకు బండి కదలని పరిస్థితి ఏర్పడింది. వేల దగ్గర నుంచి లక్షల వరకు జీతాలు తీసుకునే ఉద్యోగుల వరకు అందరూ కూడా దీన్ని నమ్ముకుని ఉన్నవారే ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం ఉండడం వలన కంటి చూపు మందగిస్తుంది అని తేలింది.
అంతేకాదు, గంటల తరబడి అదే పనిగా కూర్చొని ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్లకు ప్రమాదం ముంచుకు వస్తుందంటున్నారు నిపుణులు. కంప్యూటర్లను కానీ, టీవీ కానీ అదే పనిగా చూస్తూ కూర్చుని ఉంటే సమస్యలు తప్పవట. గంటల కొద్దీ ఎలక్ట్రానిక్ పరికరాలకు అతుక్కొని కూర్చుంటే రోగాలు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలియచేస్తున్నారు.
రెండు గంటల కంటే తక్కువ సమయం కంప్యూటర్ వాడే వారితో పోల్చి చూస్తే ఎక్కువ సేపు టీవీలు, కంప్యూటర్లతో ఉండేవారికి వారికి రకరకాల రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. దీనివల్ల వచ్చే రోగాల వలన కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు సైతం ప్రమాదం ఏర్పడుతుంది. మామూలు మరణాల కంటే ఈ మరణాలు 48శాతం ఎక్కువగా ఉండటం గమనించవలసిన విషయం.మరో విషయం ఏమిటంటే ఎలక్ట్రానిక్ వస్తువులకు గంటలు తరబడి అతుక్కు పోయే వారు .. ఎంత వ్యాయామం చేసినా ప్రయోజనం లేదని కూడా పరిశోధనలు చెబుతున్నాయి.
అలా అని ఇప్పటికిప్పుడు వాటిని వదిలేసి ఇంకో జీవనోపాధి చూసుకోలేము కాబట్టి.. కంప్యూటర్ ముందు కూర్చోవడం ఎలాగూ తప్పదు కాబట్టి… అదే పనిగా కూర్చుని ఉండి పోకుండా అప్పుడప్పుడు కుదిరితే గంటకు ఒకసారి అయినా కూర్చున్న చోటు నుంచి లేచి ఒక ఐదు నిమిషాలు అలా తిరిగి వస్తే మంచిది అని వైద్యులు తెలియచేస్తున్నారు. అలా చేయడం వల్ల కళ్ల తో పాటు మెదడుకు కూడా విశ్రాంతి లభించి, కొంత ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటుంది.