Pet Dog: మానవత్వం మరిచిన కొందరు మనుషులు మృగాల కంటే దారుణంగా ప్రవర్తించడం ఈ రోజుల్లో అలవాటైపోయింది.. పక్క వ్యక్తుల పైన దాడులకు, హత్యలకు కొందరు తెగబడుతున్న నేపథ్యంలో అసలు మనిషి అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. అయితే నేడు అదే క్రూరత్వం మూగజీవాలు సైతం హింసించడం వరకు వచ్చింది. వాటి హక్కులకు భంగం కలిగిస్తుంది. తాజాగా ఒక వ్యక్తి తన ఇంట్లో పెంచుకుంటున్న కుక్కను క్రూరంగా హింసించాడు.. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు..
బీహార్ లోని ముజఫర్ పూర్ లో ఒక వ్యక్తి తను పెంచుకుంటున్న కుక్కను అతి దారుణంగా హింసించాడు.. అతను పెంపుడు కుక్క ను దారుణంగా కొట్టడంతో కన్ను పోయిందని జంతువుల హక్కుల కార్యకర్త సుమంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో కుక్క యజమాని రాజ్ కుమార్ పై జంతు క్రూరత్వం చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి భగీరత్ ప్రసాద్ తెలిపారు. పెంపుడు జంతువు యొక్క పరిస్థితి గురించి ఆరా తీయడానికి రాజ్ కుమార్ ఇంటికి వెళ్ళినప్పుడు కుక్క యజమాని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని జంతువుల కార్యకర్త సుమంత్ ఆరోపించాడు. నా కుక్క నా ఇష్టం ఎలాగైనా కొట్టుకుంటానంటు కుక్క యజమాని సుమంత్ పై విరుచుకు పడ్డాడు.. దీంతో అతనిపై జంతువుల క్రూరత్వం చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.