ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ పార్టీ గుర్తింపు రద్దును కోరుతూ ఈరోజు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. పిటీషన్ ను స్వీకరించిన కోర్టు త్వరలో విచారణ జరపనుంది. అన్నా వైఎస్సార్ నేత భాషా ఈ పిటీషన్ ను దాఖలు చేసారు.
ఇప్పటికే ఎన్నికల సంఘానికి అన్నా వైఎస్సార్ నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి బదులు వైఎస్సార్ పేరును వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందించారు. ఇదిలా ఉంటే పార్టీ విషయాలపై బహిరంగంగా మాట్లాడుతున్నాడన్న కారణంతో ఎంపీ రఘురామకృష్ణంరాజుకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో షోకాజ్ నోటీసు ఎలా ఇస్తారని ఎంపీ ప్రశ్నించారు.