Petrol Price : దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది. పెట్రోల్ ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ఆందోళన, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరల పెరుగుదలపై కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు.
Petrol Price : ఉత్పత్తి తగ్గుదలే ధరల పెరుగుదలకు కారణం
ముడి చమురు ఉత్పత్తి చేసే దేశాలు ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తి తగ్గించడం వల్లనే మన దేశంలో ధరలు పెరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. వాటి ఉత్పత్తిని పెంచాలని రష్యా, ఖతార్, కువైడ్ లాంటి దేశాలపై ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారు. ఒక వేళ ఉత్పత్తి పెరిగితే బ్యారెల్ ముడి చమురు ధర తగ్గుతుందని ఆయన అన్నారు. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే నెల లేదా ఏప్రిల్ లో తగ్గే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో ఆయా దేశాలు కరోనా నేపథ్యంలో ఉత్పత్తి తగ్గించాయన్నారు. ప్రస్తతం కరోనా ప్రభావం తగ్గడంతో డిమాండ్ పెరిగినప్పటికీ ఆ దేశాలు డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి పెంచడం లేదని అన్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయనేది కఛ్చితంగా చెప్పలేమని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.