ఈ లాక్ డౌన్ సమయంలో స్మార్ట్ ఫోన్ ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలుస్తోంది. విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు వినాలన్నా…. ఉద్యోగులు జూమ్ వీడియోలో కాన్ఫరెన్స్ లో పాల్గొనాలన్నా…. ఏదైనా విషయాన్ని శోధించేందుకు ఇంటర్నెట్ తో నడిచే ఈ స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇప్పుడిదే స్మార్ట్ ఫోన్స్ తో చాలా మంది బిజినెస్ కూడా మొదలు పెట్టేశారు. ఇక స్కూళ్ళు అయితే వాళ్ళ విద్యార్థుల సంఖ్య పెంచుకునేందుకు సరికొత్త ఆఫర్ పెట్టేశాయి.
తమిళనాడు మధురైలోని తియాగరాజర్ పాఠశాల వారు తమ విద్యార్థుల సంఖ్య పెంచుకునేందుకు సరికొత్త ఆఫర్ పెట్టింది. తమ స్కూల్ లో చేరే ఆరవ తరగతి విద్యార్థులందరికీ ఉచితంగా ఫోన్లు ఇస్తామని తెలిపారు. అలాగే ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేందుకు వీటిని అందిస్తున్నట్లు కూడా యాజమాన్యం పేర్కొంది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా చాలా పాఠశాలలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో విద్యాసంవత్సరం ప్రారంభించి యాజమాన్యాలు ఆన్లైన్లోనే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి.
ఇక తమిళనాడు ప్రభుత్వం అయితే ఈ మధ్యనే పాఠశాలలో అడ్మిషన్లు కూడా పర్మిషన్ ఇచ్చేసింది. దీనితో కొత్త విద్యార్థుల కోసం స్కూలు మొదటిరోజే మొబైల్ ఫోన్ ల ఆఫర్ పెట్టేసింది. ఈ తియాగరాజర్ స్కూలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైవేటు పాఠశాల కావడం ఇక్కడ విశేషం. దీంతో స్కూల్లో చేరిన మొట్టమొదటి రోజే ఒక్కో విద్యార్థికి స్మార్ట్ ఫోన్ ని ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు సొంత ఖర్చులతో విద్యార్థులకు ఈ మొబైల్ ఫోన్స్ అందించనున్నారని స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రామనాథన్ చెప్పారు. ఇక పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు…. అలాగే ఈ నిర్ణయం తమిళ భాషను కూడా ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?