Phone Pay : ప్రముఖ ఇండియన్ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఫోన్పే తాజాగా తన కస్టమర్లకు ఓ శుభవార్తను అందించింది. నీతి ఆయోగ్లో భాగంగా ఈ విషయం వెల్లడించింది. ఫోన్ పే త్వరలో హ్యాకథాన్ నిర్వహించబోతోంది. ఫిన్టెక్ ఎకోసిస్టమ్లో సంచలనాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ హ్యాకథాన్ తీసుకు వస్తున్నారు. ఇన్నోవేటర్లకు, డిజిటల్ క్రియేటర్లకు, డెవలపర్లకు దీని వల్ల మంచి లాభం చేకూరనుంది. ఈ హ్యాకథాన్లో పాల్గొని గెలిచిన వారికి రూ.5 లక్షల ప్రైజ్ మనీ దొరకనుంది.
Phone Pay : టర్మ్స్ అండ్ కండిషన్స్:
విన్నైన గ్రూప్ కి రూ.1.5 లక్షలు వరకు లభించనున్నాయి. 2nd, 3rd ప్లేసుల్లో ఉన్న టీమ్స్కు వరుసగా రూ.లక్ష, రూ.75 వేల చొప్పున ప్రైజ్ మనీ అందనుంది. ఇక ఇందులో పాల్గొనడానికి రిజిస్టర్ చేసుకోవడానికి ఫిబ్రవరి 23 వరకు ఛాన్స్ వుంది. అలాగే ఎంట్రీస్ చివరి గడవు ఫిబ్రవరి 25గా నిర్ణయించడం జరిగింది. ఇకపోతే విన్నర్లను ఫిబ్రవరి 28న ప్రకటిస్తారు. ఇందులో ఎటువంటి భేషజాలకు తావులేదు. తుది నిర్ణయం జడ్జీలు నిర్ణయిస్తారు.
మిగిలిన వివరాలు:
ఇక విషయం ఏమంటే, ఓపెన్ డేటా APIలు ఉపయోగించి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఆర్థిక సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రుణాలు, బీమా, ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన ప్రత్యామ్నాయ రిస్క్ మోడల్స్, ఆర్థిక సేవలను విస్తృతంగా వినియోగించేలా పవర్ డేటా సిగ్నల్స్ ఉపయోగించే వినూత్న ఉత్పత్తులు, డిజిటల్ చెల్లింపుల డేటా ఆధారంగా మెరుగైన విజువలైజేషన్, డెరైవ్డ్ ఇంటెలిజెన్స్ వంటివి హ్యాకథాన్ వెనుక వున్న కారణాలని చెప్పుకోవచ్చు.