Photo Story : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా లైగర్.. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ ,కన్నడ , మలయాళం భాషలలో రూపొందుతున్నది. ఈ సినిమా ను సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.. ఈ చిత్రాన్ని ఛార్మి , కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో విజయ్ సరసన బాలీవుడ్ నటి అనన్య పాండే నటిస్తోంది..
ఈ సినిమా షూటింగ్ ముంబైలో పాటు విదేశాల లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది . పాన్ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు. తాజాగా లైగర్ సినిమా షూటింగ్లో విజయ్ దేవరకొండ తో పాటు సైఫ్ కూతురు, కియారా, పూరి జగన్నాధ్, ఛార్మి కలిసి తీసుకున్న ఒక ఫోటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.. నెట్టింట ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..