మన దేశంలో పలు ప్రభుత్వ హాస్పిటళ్లలో సదుపాయాలు ఎంత దారుణంగా ఉన్నాయో.. నిజంగా ఈ సంఘటన మనకు సాక్ష్యాలతో సహా తెలియజేస్తుంది. అసలే కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఆపై వర్షాకాలం మొదలైంది. దీంతో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది. ఇంత ప్రమాదం పొంచి ఉన్నా.. ఆ హాస్పిటల్లో సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారు. ఫలితం.. ఆ హాస్పిటల్ ప్రాంగణంలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. పైగా అది కోవిడ్ హాస్పిటల్ కావడం గమనార్హం.
కర్ణాటకలోని కలబురగిలో ఉన్న కోవిడ్ హాస్పిటల్ ప్రాంగణంలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ క్రమంలో తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఈ విషయం ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు దాకా వెళ్లింది. ఈ క్రమంలో ఆయన సదరు హాస్పిటల్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పందులు స్వైర విహారం చేస్తుంటే ఏం చేస్తున్నారు ? సరైన చర్యలు తీసుకోండి. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు.. అని అక్కడి సిబ్బందిని హెచ్చరించారు.
Shocking video emerges from Karnataka govt hospital; 50 pigs found roaming hospital corridor in Kalaburagi pic.twitter.com/Daw3SHnZ0R
— Zee News English (@ZeeNewsEnglish) July 19, 2020
అయితే ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు. కర్ణాటక ప్రభుత్వం కోవిడ్ నియంత్రణలో విఫలం చెందడమే కాదు, హాస్పిటళ్లలో రోగులకు కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని ఆరోపించారు. కాగా దేశంలోనే మొదటి కరోనా మరణం కూడా కలబురగిలోనే సంభవించడం మరో విశేషం. కర్ణాటకలో శనివారం ఒక్క రోజే 4,537 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 59,652కు చేరుకుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?