Sidabad Rape Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన ఆరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసు నిందితుడు రాజు మృతిపై కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజు మృతదేహాం రైల్వే ట్రాక్ పై లభ్యం అవ్వడంతో ఆతను పోలీసులకు, ప్రజలకు భయపడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించారు. మరో పక్క రాజు కుటుంబ సభ్యులు దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే ఎన్ కౌంటర్ చేసి ఆత్మహత్యగా చూపుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరుణంలో రాజుది ఆత్మహత్య కాదనీ, కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందంటూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ పై ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట తరువాత విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
ఈ నెల 9వ సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం జరిగింది. ఈ ఘటన తరువాత నిందితుడుగా ఉన్న రాజు కనిపించకుండా పోయాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. రాజు ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు పది లక్షల రివార్డు కూడా ప్రకటించారు. పోలీసులు రాజు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు. మరో పక్క ప్రముఖులు, సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఓ పక్క పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తుండగానే స్టేషన్ ఘన్ పూర్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడు రాజు అన్ని వైపులా చుట్టుముట్టడంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని పోలీసులు ముందుగానే భావించి రైల్వే ట్రాక్ లపై గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు రైల్వే ట్రాక్ లపై మృతి చెందిన వారి వివరాలను ఆరా తీశారు. మార్చురీల్లో భద్రపర్చిన మృతదేహాలను పరిశీలించారు.
Read More:
1.AP SEC: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎప్పుడంటే.. ?
2.TS News: జన జీవన స్రవంతిలోకి ఆ మహిళా మావోయిస్టు నేత..!!
3.Justice Kanagaraj: జస్టిస్ కనగరాజ్కు ఇచ్చిన రెండవ పదవీ పాయె..!!