మలబద్ధకం ఉన్నవారికి మొలలు ఏర్పడే అవకాశంఎక్కువగా ఉంది. మల విసర్జన సాఫీగా జరగకపోవడం అనేది ఈ సమస్యకుప్రధాన కారణం గా చెప్పవచ్చు. మొలలు వ్యాధి ఉన్నవారు తీసుకోవాలిసిన కొన్ని జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం… ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రత్యేకించి నీళ్ళను బాగా తాగేలా చూసుకోవాలి. ఆహారం లోకి పాత బియ్యం, పాత గోధుమలు వాడుకోవాలి.
- సగ్గుబియ్యం, బార్లీ జావలు తీసుకుంటూ ఉండాలి .
- బీరకాయ, పొట్లకాయ కూరలుఎక్కువగా తినవలిసి ఉంటుంది .
- పెసరపప్పును మాత్రమే ఆహారం లో తీసుకోవాలి. కందిపప్పు , మినపపప్పు తినకుండా ఉండడం మంచిది .
- కోడి మాంసం, గుడ్డు చేప , రొయ్యలు అసలు తీసుకోకుండా ఉండడం మంచిది. ఎప్పుడైనా ఒకసారి మేక మాంసం అది కూడా తక్కువ మోతాదు లో మసాలా తక్కువ వేసి తినవచ్చు.
- పళ్ల రసాలు తాగాలి. ముఖ్యంగా యాపిల్ రసం ఎక్కువగా తీసుకోవాలి .
- పాలకూర, పెరుగుతోటకూర, మెంతికూర, గంగపాయల కూర వంటి ఆకుకూరల ఎక్కువసార్లు తీసుకుంటూ ఉండాలి.
- ఆహారం లో పాతపచ్చళ్ళు వేసుకోవడం పూర్తిగా ఆపేయాలి.
- ఎక్కువసేపు ప్రయాణాలు చేయకుండా ఉండడం ఉత్తమం .
- గట్టిగా ఉండే చెక్క కుర్చీల పైన ఎక్కువ సమయం కూర్చోకూడదు. అలాని స్పాంజితో చేసిన వాటిమీద కూడా కూర్చోకూడదు. బూరుగు దూది తో లేదా పత్తితో చేసినవి ఉపయోగించాలి .
- మలబద్దకం లేకుండా సుఖవిరేచనం అయ్యేలాజాగ్రత్తలు తీసుకోవాలి .
- శరీరానికి వేడిచేసే పదార్థాల కువీలయినంత దూరంగా ఉండడంతో పాటు మజ్జిగ ఎక్కువ తాగాలి .
- కొత్త చింతపండు , కొత్త బెల్లం కూడా తీసుకోక పోవడం మంచిది.
- ఆహారం లో నువ్వులు , ఆవాలు , నువ్వు చెక్క వాడకుండా ఉండడం మంచిది.
- ఆహారంలో నూనెతక్కువగా ఉండేలా చూసుకోవాలి.
- చద్దన్నం, చల్లబడినవి , మెత్తపడిన తినకూడదు.
- ఎలాంటి పరిస్థితుల్లోనూ బచ్చలి,వంకాయ , గోంగూర, సొరకాయ, మొలల సమస్య ఉన్నవారు తినరాదు.
- మొలల సమస్యతో బాధ పడుతున్నవారు శరీరంలో వేడి,వాతం పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సరైనవైద్యుడుని సంప్రదించి చికిత్స పొందాలి .