(హైదరాబాద్ నుండి ‘న్యూస్ ఆర్బిట్’ ప్రతినిధి)
జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు అయ్యింది. రిజర్వేషన్లు రొటేషన్ చేశాకే ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్ దాఖలు అయ్యింది. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నారని పిటిషనర్ ఆరోపిస్తున్నారు.
బీజెపికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ సుభాస్ చంద్ర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషన్లో నాలుగైదు అంశాలను ప్రస్తావించారు. రిజర్వేషన్లు రొటేషన్ చేసి ఎన్నికలు నిర్వహించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఈ పిల్పై కొద్ది సేపటిలో హైకోర్టులో విచారణ జరగనున్నది.
ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు చకచెకా అడుగులు వేస్తున్న ఈ తరుణంలో హైకోర్టులో పిల్ దాఖలు కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పిల్ పై పిటిషనర్ తరపున న్యాయవాది తన వాదనలు వినిపించిన తరువాత హైకోర్టు ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు విన్న తరువాత హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించే అవకాశాలు ఉన్నాయి.