ఏపీలో ఈఎస్ ఐ స్కాం రకరాకాల సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యేలా ఉంది! ఇప్పటికే ఈ కేసులో అచ్చెన్న అరెస్టు.. అనంతరం ఆందోళనలో టీడీపీ శ్రేణులు సంగతి తెలిసిందే! ఈ క్రమంలో అచ్చెన్న అనంతరం ఈ కేసుకు సంబందించి మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ.. ఆయన తనయుడు.. మంత్రి మాజీ పీఎస్ అరెస్టయ్యే సూచనలు ఉన్నాయని వార్తలొచ్చిన నేపథ్యంలో.. అనుకున్నట్లుగానే పితాని మాజీ పీఎస్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నెక్స్ట్ తనే అనుకున్నారో ఏమో కానీ… పితాని పుత్రరత్నం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంట.
అవును… మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడి కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. ఈఎస్ఐ స్కామ్లో పితాని కుమారుడు ప్రమేయం ఉందని వార్తలు రావడం.. ఆయన ముందస్తు బెయిల్ కు ప్రయత్నించడం.. అదికాస్తా రాకపోయే సరికి ఆజ్ఞాతంలోకి వెళ్లిపోవడం జరిగాయంట. ప్రస్తుతం ఈయన ఆచూకీ గురించి మాజీ పీఎస్ మురళీమోహన్ కు తెలిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బలంగా నమ్ముతున్న ఏసీబీ అధికారులు ఆయన్నే ప్రశ్నిస్తున్నారంట. ఇలా అజ్ఞాతంలోకి వెళ్లడం “కొత్త సంకేతాలు” ఇస్తుందనేది ఈ సందర్భంగా పలువురు అభిప్రాయంగా ఇంది!
కాగా… ఈఎస్ఐ కుంభకోణంలో నిందితులుగా ఉన్న పితాని సత్యనారాయణ కుమారుడు వెంకటేష్, మాజీ కార్యదర్శి మురళీమోహన్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కేవలం రాజకీయ కక్షతో ఈ కేసులో ఇరికించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించగా… వీరి వాదనతో ఏసీబీ తరఫు న్యాయవాది విభేదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వులో ఉంచారు.