NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

పీకే టీమ్ వస్తుంది: మీ నియోజకవర్గంలో ఎప్పుడంటే..!? నాలుగు అంశాల్లో కీలక సర్వే..!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు పొలిటికల్ సీజన్ ను మొదలు పెట్టేశాయి. అంటే రానున్న ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలు మానసికంగా ప్రెపేర్ అయిపోవడంతో పాటు నాయకులను సంసిద్దులను చేయడం. ఇతర పార్టీలకంటే అధికార వైసీపీ ఈ విషయంలో మూడు అడుగుల ముందే ఉంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధం అవ్వడంలో వైసీపీ ముందంజలో ఉంది. ఈ ఏడాది మార్చి నుండి ప్రశాంత్ కిషోర్ (పీకే) టీమ్ ను వైసీపీ దింపింది.  అలాగే ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు ఏజన్సీని కూడా దింపి వైసీపీ సర్వేలు చేయించుకుంటోంది. అంతే కాకుండా రాష్ట్రానికి సంబంధించి ఓ సంస్థతో కూడా సర్వే చేయిస్తున్నారుట. ఈ మూడు రకాల సర్వేలతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా, సాక్షి మీడియా ద్వారా మొత్తం అయిదు రకాలుగా సర్వేలు చేయించుకుంటోంది. సీఎం జగన్మోహనరెడ్డి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు.

వివిధ ఏజన్సీల ద్వారా అభిప్రాయ సేకరణ

ఎమ్మెల్యేల పనితీరు, తన పై ఉన్న అసంతృప్తి, సంతృప్తి విషయాలు, మంత్రుల పనితీరు, నాయకుల పనితీరు, కార్యకర్తల అభిప్రాయాలు, పరిపాలన తీరు ఇలా రకరకాల యాంగిల్స్ లో రిపోర్టులను జగన్ తెప్పించుకుంటున్నారు. మరో పక్క టీడీపీ, జనసేన పార్టీలు కూడా వారి వారి ఏజన్సీల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు. టీడీపీ ఇప్పటికే ఇద్దరు రాజకీయ స్ట్రాటజిస్ట్ లను పెట్టుకుంది. జనసేన పార్టీ ఇంత వరకూ స్ట్రాటజిస్ట్ ల మీద ఆధారపడలేదు కానీ వాళ్లు ఒక ప్లాన్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు రెడి అయ్యే ముందు ఒక ప్లాన్ తో ఉన్నారు. ప్రస్తుతం పీకే (ప్రశాంత్ కిషోర్) టీమ్ ఏమి చేస్తుంది..? అనే విషయాలను పరిశీలిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పని తీరు ఎలా ఉంది ? వాలంటీర్ల పని తీరు ఎలా ఉంది ? ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది ? అనే ఈ మూడు అంశాలతో పాటు ఎమ్మెల్యేల పనీతీరు, అధికారుల పని తీరు మీద ఈ టీమ్ అధ్యయనం చేస్తొంది. ఓవరాల్ గా ప్రభుత్వ పని తీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా..? అసంతృప్తిగా ఉన్నారా..? అనే విషయాలపై అభిప్రాయ సేకరణ చేస్తొంది పీకే టీమ్.

 

40 నియోజకవర్గాల్లో పీకే టీమ్

గత 20 రోజుల నుండి అంటే జూలై మొదటి వారం నుండి ఈ పనిలో పీకే టీమ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 – 40 నియోజకవర్గాల్లో ఈ అభిప్రాయ సేకరణ జరుగుతోంది. చీరాల, పర్చూరు, దెందులూరు, గోపాలపురం, నిడదవోలు, విశాఖపట్నం టౌన్ తదితర జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణలో పీకే టీమ్ వర్క్ చేస్తొంది. ఒక్కో నియోజకవర్గంలో రెండు మూడు బృందాలుగా విడిపోయి పై అంశాలపై ప్రజల నుండి అభిప్రాయాలను తీసుకుంటోంది. ఈ అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదికను ఆగస్టు నెలాఖరు నాటికి జగన్మోహనరెడ్డికి అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఓవరాల్ గా ప్రభుత్వ పనితీరుపై నివేదిక సీఎం జగన్మోహనరెడ్డికి అందనుంది.

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు .. ఆర్కే ఏం రాశారు..!?

author avatar
Special Bureau

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?