ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు పొలిటికల్ సీజన్ ను మొదలు పెట్టేశాయి. అంటే రానున్న ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలు మానసికంగా ప్రెపేర్ అయిపోవడంతో పాటు నాయకులను సంసిద్దులను చేయడం. ఇతర పార్టీలకంటే అధికార వైసీపీ ఈ విషయంలో మూడు అడుగుల ముందే ఉంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధం అవ్వడంలో వైసీపీ ముందంజలో ఉంది. ఈ ఏడాది మార్చి నుండి ప్రశాంత్ కిషోర్ (పీకే) టీమ్ ను వైసీపీ దింపింది. అలాగే ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు ఏజన్సీని కూడా దింపి వైసీపీ సర్వేలు చేయించుకుంటోంది. అంతే కాకుండా రాష్ట్రానికి సంబంధించి ఓ సంస్థతో కూడా సర్వే చేయిస్తున్నారుట. ఈ మూడు రకాల సర్వేలతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా, సాక్షి మీడియా ద్వారా మొత్తం అయిదు రకాలుగా సర్వేలు చేయించుకుంటోంది. సీఎం జగన్మోహనరెడ్డి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు.
వివిధ ఏజన్సీల ద్వారా అభిప్రాయ సేకరణ
ఎమ్మెల్యేల పనితీరు, తన పై ఉన్న అసంతృప్తి, సంతృప్తి విషయాలు, మంత్రుల పనితీరు, నాయకుల పనితీరు, కార్యకర్తల అభిప్రాయాలు, పరిపాలన తీరు ఇలా రకరకాల యాంగిల్స్ లో రిపోర్టులను జగన్ తెప్పించుకుంటున్నారు. మరో పక్క టీడీపీ, జనసేన పార్టీలు కూడా వారి వారి ఏజన్సీల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు. టీడీపీ ఇప్పటికే ఇద్దరు రాజకీయ స్ట్రాటజిస్ట్ లను పెట్టుకుంది. జనసేన పార్టీ ఇంత వరకూ స్ట్రాటజిస్ట్ ల మీద ఆధారపడలేదు కానీ వాళ్లు ఒక ప్లాన్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు రెడి అయ్యే ముందు ఒక ప్లాన్ తో ఉన్నారు. ప్రస్తుతం పీకే (ప్రశాంత్ కిషోర్) టీమ్ ఏమి చేస్తుంది..? అనే విషయాలను పరిశీలిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పని తీరు ఎలా ఉంది ? వాలంటీర్ల పని తీరు ఎలా ఉంది ? ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది ? అనే ఈ మూడు అంశాలతో పాటు ఎమ్మెల్యేల పనీతీరు, అధికారుల పని తీరు మీద ఈ టీమ్ అధ్యయనం చేస్తొంది. ఓవరాల్ గా ప్రభుత్వ పని తీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా..? అసంతృప్తిగా ఉన్నారా..? అనే విషయాలపై అభిప్రాయ సేకరణ చేస్తొంది పీకే టీమ్.
40 నియోజకవర్గాల్లో పీకే టీమ్
గత 20 రోజుల నుండి అంటే జూలై మొదటి వారం నుండి ఈ పనిలో పీకే టీమ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 – 40 నియోజకవర్గాల్లో ఈ అభిప్రాయ సేకరణ జరుగుతోంది. చీరాల, పర్చూరు, దెందులూరు, గోపాలపురం, నిడదవోలు, విశాఖపట్నం టౌన్ తదితర జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణలో పీకే టీమ్ వర్క్ చేస్తొంది. ఒక్కో నియోజకవర్గంలో రెండు మూడు బృందాలుగా విడిపోయి పై అంశాలపై ప్రజల నుండి అభిప్రాయాలను తీసుకుంటోంది. ఈ అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదికను ఆగస్టు నెలాఖరు నాటికి జగన్మోహనరెడ్డికి అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఓవరాల్ గా ప్రభుత్వ పనితీరుపై నివేదిక సీఎం జగన్మోహనరెడ్డికి అందనుంది.
ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు .. ఆర్కే ఏం రాశారు..!?
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?