కరోనా వైరస్ కారణంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ప్రయివేటు, ప్రభుత్వ సంస్థలు అని తేడా లేకుండా ఆర్థికంగా కుదేలయ్యాయి. ఇక భారతీయ రైల్వే సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలుగా వృద్ధి క్షీణిస్తుండటంతో.. ఆదాయాన్ని పెంచుకునేందుకు పలు రూట్లలో ప్రయివేటు రైళ్లను సైతం అనుమతినిచ్చింది. ఇదిలా ఉండగానే కరోనా దెబ్బకొట్టింది. దీంతో ఎలాగైనా తన ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్న ఇండియన్ రైల్వేస్.. ప్రజలపై భారం మోపడానికి సిద్ధమవుతోంది. ఇదివరకూ ఉన్న పలు రకాల ఛార్జీలను పెంచేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం.
తన ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్లాట్ ఫామ్ టిక్కెట్టు ధరలను పెంచడానికి సిద్ధమవుతోంది. ఈ పెంపు రెట్టింపు స్థాయిలో ఉండనున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా దేశంలోని అన్నీ చోట్ల ప్లాట్ ఫామ్ ధర రూ.10గా ఉంది. రెట్టింపు అంటే ఇది రూ.20కు చేరే అవకాశముంది. అయితే, దేశం మొత్తంగా కాకుండా కేవలం కొన్నింటిలోనే ఈ ధరలు వుండే అవకాశముంది. అవి 121 స్టేషన్లు.
అలాగే, ప్లాట్ఫామ్ టిక్కెట్టు ధరలతో పాటు యూజర్ డెవలప్ మెంట్ ఛార్జీల వసూలుకు కూడా రంగం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. ఇదివరకూ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసమని పలు ప్రయివేటు సంస్థలతో ఒప్పందాలు కూడా భారత రైల్వేస్ కుదుర్చుకుంది. దీనిలో భాగంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి, నిర్వహణ వంటి బాధ్యతలను వాటికి అప్పగించిన సంగతి తెలిసిదే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?