(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: సిఆర్డిఏ చట్టం రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం ఉదయం రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. ఈ బిల్లు నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయ్యింది.
సోమవారం శాసనసభలో ప్రభుత్వం సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేస్తూ ఏఎంఆర్టిఏను తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లును పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది.