PM Modi: భారత ప్రధాని నరేంద్రమోడీకి ఇష్టమైన ఆహారం ఏమిటో అందరికీ తెలిసిందే. భారతీయ సంప్రదాయంలో చేసిన కిచిడీని అతను ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ఈ వంటకాన్ని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్వయంగా వండి, భారత్-ఆస్ట్రేలియా మధ్య సంబంధాన్ని దశదిశలా వ్యాపింపజేశారు. అవును.. ఇండియాలో ఆస్ట్రేలియా కొత్త వాణిజ్య ఒప్పందం జరిగిన నేపథ్యంలో స్కాట్ మారిసన్ ఇలా సెలెబ్రెట్ చేసుకున్నారు. ఈ మేరకు శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టమైన కిచిడిని తయారు చేసిన ఫొటోను తన ఇన్స్టాలో పోస్ట్ చేయడం విశేషం.
Pakistan PM Imran Khan: విశ్వాస పరీక్షకు ముందే ఇమ్రాన్ రాజీనామా..?
PM Modi:వైరల్ అవుతున్న పోస్ట్..
ఇక ఆ పోస్టులో ఆయన రాస్తూ.. భారత్ లో తమ కొత్త వాణిజ్య ఒప్పందం జరిగిన తరుణంలో రాత్రి వేళ వంటల తయారీ కోసం ఎంచుకున్న ఆహారం ప్రియమైన మిత్రుడు ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ప్రాంతానికి చెందినవి అని మోరిసన్ ఈ పోస్టులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వంటగదిలో ఉన్న ఫొటోను షేర్ చేసి.. అందర్ని ఆశ్యర్యపరిచారు. ఇకపోతే ఏప్రిల్ 2న భారతదేశం, ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసిన విషయం విదితమే. ఈ వ్యాపార ఒప్పందం ప్రకారం.. కాన్బెర్రా, వస్త్రాలు, తోలు, ఆభరణాలు, క్రీడా ఉత్పత్తుల వంటి 95% పైగా భారతీయ వస్తువులకు మార్కెట్లో సుంకం రహిత యాక్సెస్ లభించనుంది.
PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ పర్యటనకు మోహం చాటేస్తున్న సీఎం కేసిఆర్..? రేపు హైదరాబాద్ కు మోడీ.. షెఢ్యూల్ ఇదీ..
ఈ ఒప్పందంలో భాగంగా భారతదేశం-ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్, ఆస్ట్రేలియా వాణిజ్యం, పర్యాటకం-పెట్టుబడి శాఖల మంత్రి అయినటువంటి డాన్ టెహన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం అనంతరం ప్రధాని నరేంద్రమోడీ, స్కాట్ మారిసన్ భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. ఇకపోతే ప్రధాని మోదీ తనకిష్టమైన కిచిడి గురించి సందర్భానుసారంగా ఇంటర్వ్యూలల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.