కేరళ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఈ విమాన వాహక నౌకను జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ మాట్లాడుతూ కేరళ తీరంలో ఈ రోజు నవశకం ప్రారంభమైందని తెలిపారు. అమృతతోత్సవ వేళ ఐఎన్ఎస్ నౌక ప్రవేశం శుభపరిణామమని అన్నారు. భారత్ కు సాధ్యం కాదనిది ఏదీ ఉండదన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకను చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని అన్నారు.
ఇవి ఈ బాహుబలి నౌక ప్రత్యేకతలు
- ఈ నౌక తయారీకి ప్రభుత్వం రూ.20వేల కోట్ల ఖర్చు చేసింది. ఈ నౌక తయారీకి 13 ఏళ్ల సమయం పట్టింది. ఇప్పటి వరకూ భారత్ వద్ద ఉన్న యుద్ద నౌకలన్నీ బ్రిటన్, రష్యాల నుండి దిగుమతి చేసుకున్నవే కాగా అగ్రదేశాలు ఆశ్చర్యపోయేలా అత్యాధునిక విమాన వాహక యుద్ద నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ విజయవంతంగా నిర్మించింది.
- 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు కల్గిన ఈ నౌక బరువు 37,500 టన్నులు. ఇందులో మొత్తం 14 అంతస్తులు, 2300 కంపార్ట్ మెంట్స్ ఉన్నాయి. విధుల్లో 1600 మంది సిబ్బంది ఉంటారు.
- మహిళా ఆఫీసర్లకు ప్రత్యేక క్యాబిన్లు ఉన్నాయి. గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ఏకధాటిగా 7,500 నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు. క్షిపణి దాడిని తట్టుకోగలదు.
- ఈ నౌకలో పూర్తి స్థాయి మెడికల్ కాంప్లెక్స్ ఉంది. ఫిజియోథెరఫీ, ఐసీయూ, పరీక్షశాలు కూడా ఉన్నాయి.
- ఈ నౌకపై 30 యుద్ద విమానాలను సౌకర్యవంతంగా నిర్వహించవచ్చు. మిగ్ – 29 కే ఫైటర్ జెట్లు, కమావ్ – 31, హెచ్ఆర్ – 60 ఆర్ హెలికాఫ్టర్ లు దీనిపై అందుబాటులో ఉంటాయి.
రెండు భారీ అగ్ని ప్రమాదాలు .. లక్షల్లో ఆస్తినష్టం .. కానీ